SLBC Tunnel Collapse: ఎస్ఎల్బీసీ ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన డిమాండ్

KTR Demands Judicial Commission On SLBC Collapse: దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎస్‌ఎల్‌బీసీ సొరంగ పనుల్లో జరిగిన ప్రమాదంపై మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన డిమాండ్‌ చేశారు. ఈ ప్రమాదంపై న్యాయ విచారణ కమిటీ ఏర్పాటుచేయాలని కోరారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 25, 2025, 05:25 PM IST
SLBC Tunnel Collapse: ఎస్ఎల్బీసీ ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన డిమాండ్

 SLBC Tunnel Collapse: శ్రీశైలం ఎడమ కాలువ సొరంగంలో ప్రమాదం సంభవించినా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం.. అలసత్వం ప్రదర్శించడంపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంపై జ్యూడిషల్ కమిషన్ ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడేందుకు సహాయ చర్యలు వేగవంతం చేయాలని కోరారు.

Add Zee News as a Preferred Source

Also Read: Hyderabad Water: హైదరాబాద్‌లో డేంజర్‌ బెల్స్‌.. తాగునీటి కష్టాలతో నగరవాసులు విలవిల

ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంపై 'ఎక్స్‌' వేదికగా భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంపై జ్యూడిషల్ కమిషన్ ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవైపు సహాయక చర్యలను మరింత వేగవంతంగా కొనసాగిస్తూనే జరిగిన ప్రమాదానికి బాధ్యులైన వారి పై విచారణ చేపట్టాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తుచేశారు.

Also Read: Holiday: గుడ్‌న్యూస్‌.. ఎల్లుండి ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు సెలవు

'ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంతో ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం జరిగింది. ఇంతకుముందు సుంకిశాల, పెద్దవాగు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు చేయలేదు. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. ఈ ప్రమాదాలపై హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో న్యాయ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. 'గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు, రేవంత్ రెడ్డి సహా అనేక అంశాలపై న్యాయ కమిషన్‌ల ఏర్పాటు కోసం డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక న్యాయ కమిషన్‌లు ఏర్పాటు చేశారు' అని కేటీఆర్‌ వివరించారు.

వరుసగా జరుగుతున్న ప్రాజెక్టుల ప్రమాదాలపై న్యాయ కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఆర్మీ, ఇతర సంస్థల సహాయంతో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్  ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెంటనే వెనక్కి తీసుకువచ్చేలా ప్రభుత్వం మరింతగా కృషి చేయాలని కేటీఆర్‌ 'ఎక్స్‌' వేదికగా విజ్ఞప్తి చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News