
newly married woman murders husband with bank manager in gadwal: ప్రస్తుతం దేశంలో కొంత మంది మహిళలు తమ భర్తల్ని పెళ్లి చేసుకుని మరీ చంపేస్తున్నారు. హనీమూన్ ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో షాకింగ్ గా మారింది. సర్వేయర్ తేజేశ్వర్ దారుణ హత్య వెనుక బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు ప్రధాన కుట్రదారుడిగా పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. సదరు బ్యాంక్ మేనెజన్ కు పెళ్లి అయి అప్పటికే ఎనిమిదేళ్లవుతుంది. కానీ పిల్లలు లేరు.
ఈ క్రమంలో ఐశ్వర్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో ఐశ్వర్య ఇటీవల పెళ్లి చేసుకొని భర్తను.. అదే విధంగా తిరుమల రావు.. తనభార్యను హత్యకు ప్లాన్ వేసినట్లు పోలీసులు పలు ఆధారాలు గుర్తించారు. ఇందుకోసం ఒక సుపారీ గ్యాంగ్ను సంప్రదించినట్లు పోలీసుల దర్యాప్తులో బయపడింది.
జూన్ 17వ తేదీన, నగేష్, పరుశురాం, రాజు అనే ముగ్గురు వ్యక్తులు ల్యాండ్ సర్వే పని ఉందనే నెపంతో తేజేశ్వర్ను కారులో తీసుకెళ్లారు. పక్కాప్లాన్ ప్రకారం.. తేజేశ్వర్ ను కారులో కత్తితో అతి దారుణంగా పొడిచి, డెడ్ బాడీని కర్నూల్ శివారులో పడేశారు.ఆ తర్వాత బ్యాంక్ మెనెజర్ కు సమాచారం ఇచ్చారు. దీని కోసం.. ఒక రోజు ముందే.. రూ.20 లక్షలు డ్రాచేసిన బ్యాంక్ మెనెజర్.. సుపారీ గ్యాంగ్ కు రూ.2 లక్షలు ముట్టజెప్పాడు.
ఈ క్రమంలో ఐశ్వర్య తన భర్తను, తిరుమల రావు తన భార్యను హత్య చేసి.. లడఖ్కు పారిపోయి ప్లాన్ లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో నిందితుల్ని పట్టుకొవడానికి నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.
మరోవైపు ఇప్పటికే నెల రోజుల వ్యవధిలో మహిళ.. తన భర్తను చంపేందుకు ఐదుసార్లు ప్రయత్నించిందని, ఆరోసారి చనిపోయాడని విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది, దర్యాప్తు కొనసాగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook