)
Ghmc lady sanitation worker dead due to tusker vehicle accident in Hyderabad: దేశమంతట కూడా వినాయక నిమజ్జనం ఘనంగా జరిగింది. వినాయకుడ్ని ఎంత భక్తితో తమ ఇంటికి తీసుకొచ్చారో.. అంతే భక్తి భావనలతో తిరిగి గంగమ్మ ఓడికి చేర్చారు. మరోవైపు హైదరాబాద్ లో నిమజ్జనం ఎంతో ప్రశాంతకర వాతావరణంలో జరిగాయి. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అన్నిశాఖలకు చెందిన అధికారులు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
అంతేకాకుండా.. వినాయక నిమజ్జనాల్ని తొందరగానే ముగించేశారు. మరోవైపు మెట్రో అధికారులు, ఆర్టీసీ అధికారులు సైతం.. వినాయక నిమజ్జనం చూసేందుకు వచ్చిన భక్తుల కోసం రాత్రంతా మెట్రోల్ని అందుబాటులో ఉంచారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ప్రారంభమైన నిమజ్జనంన ఆదివారం మధ్యాహ్నం వరకు కూడా కొనసాగింది.
అయితే.. ఈరోజు ఉదయం నుంచి జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగి ఎక్కడికక్కడ రోడ్లన్ని శుభ్రం చేసే విధుల్లో బిజీ అయిపోయారు. ప్లాస్టిక్ లు, రంగు రంగుల కాగితాలు, పూలు, రిబ్బన్ లను చాలామంది రోడ్లపై పడేస్తుంటారు. అయితే.. వీటిని పారిశుద్ద కార్మికులు క్లీన్ చేస్తున్నారు. ఈ క్రమంలో బషీర్ బాగ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
గుడిమల్కాపూర్ కు చెందిన రేణుక 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పనిచేస్తుంది. ఇవాళ ఉదయం.. బషీరాబాగ్-లిబర్టీ మార్గంలో విధుల్లో ఉండగా రోడ్డు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు వాహనం కిందపడింది. టస్కర్ వాహనం కిందపడి GHMC కార్మికులు చనిపోయింది. ఆమె తలకు తీవ్రగాయం కావడంతో ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు డ్రైవర్ గజానంద్ ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఈ ఘటన మాత్రం విషాదకరంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook