School timings change
తాజాగా పిల్లలకి శుభవార్త చెబుతూ ప్రభుత్వాలు ఒంటి పూట బడులు అమలు చేసే తేదీని ప్రకటించాయి. మార్చి 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూల్లు ఆఫ్ డే స్కూల్స్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఉదయం 8 గంటలకు పాఠశాల ప్రారంభమై.. మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటుంది. ఏప్రిల్ 23 వరకు ఇదే సమయంలో పాఠశాల ఉంటుందని, టెన్త్ పరీక్షలు జరిగే స్కూళ్లలో మాత్రమే మధ్యాహ్నం పూట క్లాసులు నిర్వహిస్తారని విద్యాశాఖ వెల్లడించింది.
ఇక పదవ తరగతి కారణంగా ఎగ్జామ్స్ సెంటర్స్ గా ఉన్న పాఠశాలలకు మాత్రం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తరగతి గదులు జరగనున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఎండ తీవ్రత రెండు తెలుగు రాష్ట్రాలలో బాగా పెరిగిపోయింది. అక్కడక్కడ 37 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి .
ఈ నేపథ్యంలోనే పిల్లలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్చి 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు అమలు చేస్తుండడం పై పిల్లల తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా వాతావరణంలో మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఉష్ణోగ్రతలు అధికమైతే ఎండ తీవ్రతను పిల్లలు తట్టుకోలేరు. కాబట్టి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా తేదీలను కూడా ప్రకటించి ఉత్తర్వులు జారీ చేయడంతో అన్ని ప్రభుత్వ , ఎయిడెడ్, ప్రైవేట్ స్కూల్స్ ఇదే రూల్ ఫాలో కావాలని కూడా స్పష్టం చేయడం గమనార్హం.
READ ALSO: మైండ్బ్లోయింగ్ ఎయిర్టెల్ 77 రోజుల ప్లాన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









