)
Gurukula girls students protest in shadnagar rangareddy: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో జాతీయ రహదారిపై హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. సోషల్ వెల్ఫేర్ కు చెందిన గురుకుల విద్యార్థినులు భారీగా రోడ్ల మీదకు చేరుకున్నారు. ప్రిన్సిపల్ శైలజ తమను వేదిస్తుందని, ఆమెను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు నిరసనకు దిగారు.
అంతే కాకుండా.. శైలజ తమ నుంచి అక్రమంగా ఫీజులు వసూలు చేస్తుందని, తమను వేధిస్తుందని ఆరోపించారు. తమకు ప్రభుత్వం నుంచి వస్తున్న ఎలాంటి సదుపాయాలు కూడా అందించడంలేదని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో హైవే మీద రచ్చ ఏర్పడటంతో పోలీసులు రంగంలోకి దిగారు.
గురుకుల విద్యార్థినులపై పోలీసుల దౌర్జన్యం
మఫ్టీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ పై దాడి చేసిన విద్యార్థినులు.. పరిస్థితి ఉద్రిక్తత
షాద్ నగర్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన విద్యార్థినులు
ప్రిన్సిపల్ శైలజ తమను వేదిస్తుందని, ఆమెను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగిన… pic.twitter.com/a0G5sEIRJn
— Telugu Scribe (@TeluguScribe) November 2, 2025
ముందు అక్రమాలు ఆపండి, ఆ తర్వాత విద్యను అందించండి అంటూ ప్లకార్డుల ప్రదర్శనలు చేశారు. విద్యార్థినులకు, పోలీసులకు మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో గురుకుల విద్యార్థినులపై పోలీసుల దౌర్జన్యంకు దిగారు. ఈ క్రమంలో రెచ్చిపోయిన విద్యార్థినులు.. మఫ్టీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ పై దాడి చేశారు.
అంతేకాకుండా.. ఆమెను జుట్టుపట్టుకుని ఈడ్చుకుని వెళ్లడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో భారీగా పోలీసు బలగాలు అక్కడకు చేరుకున్నాయి. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.