Heat Waves: తెలంగాణలో మరో మూడు రోజులు రికార్డు స్థాయి ఎండలు.. మాడు పగాల్సిందే..

Heat Waves: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో  ఎండలు భగభగ మండనున్నాయి. రెండు మూడు రోజుల క్రితం  వాతావరణంలో మార్పులతో కురిసిన అకాల వర్షాలతో రెండు మూడు రోజులు చల్లబడిన వాతావరణం ఇప్పడు మళ్లీ వేడెక్కుతోంది. అంతేకాదు అంతకు మించి ఎండలతో ఠారెత్తించబోతుంది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 26, 2025, 03:20 PM IST
Heat Waves: తెలంగాణలో మరో మూడు రోజులు రికార్డు స్థాయి ఎండలు.. మాడు పగాల్సిందే..

Heat Waves:నేటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో  పగటి ఉష్ణోగ్రతలు భారీ పెరగనున్నాయని  వాతావరణ శాఖ వెల్లడించింది.  తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు పెరుగునున్నాయి. ఉత్తర దిశగా వీస్తున్న పొడి గాలుల కారణంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగనున్నాయని ఐఎండీ తెలిపింది.

Add Zee News as a Preferred Source

మార్చి 27-30 వరకూ తూర్పు తెలంగాణ ప్రాంతంలో ఉష్ణోగ్రత 41-43 డిగ్రీల వరకూ నమోదవుతుందని హెచ్చరిక జారీ అయింది. హైదరాబాద్‌లో కూడా ఉష్ణోగ్రత పెరగనుంది. 38-40 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ నుంచి వడగాలులు తీవ్రత పెరుగుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది.

మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా పలు జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా అత్యవసరం అయితే తప్పించి బయటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా బయటకు వెళ్లే డీ హైడ్రేషన్ బారిన పడే అవకాశం లేకపోలేదు. దీంతో కొబ్బరి నీళ్లు,  మజ్జిగ వంటివి తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదు బయటకు వెళ్లేటపుడు విధిగా ఓ వాటర్ బాటిల్ క్యారీ చేయాలని చెబుతున్నారు. మొత్తంగా మఫ్లర్లు.. ఎండ తగలకుండా.. సన్ స్క్రీన్ లోషన్లతో పాటు తలపై ఏదైనా టోపీ పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

READ ALSO:  Madhuri Dixit: షాకింగ్.. మాధురి దీక్షిత్ అందానికి మై మరిచిపోయి పెదవులను రక్తం కారేలా కొరికేసిన మాజీ ఎంపీ..

READ ALSO: Star Heroine: హిందువుగా పుట్టి.. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకొని.. ప్రస్తుతం క్రైస్తవ మతం అనుసరిస్తున్న స్టార్ హీరోయిన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News