Heat Waves:నేటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు భారీ పెరగనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు పెరుగునున్నాయి. ఉత్తర దిశగా వీస్తున్న పొడి గాలుల కారణంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగనున్నాయని ఐఎండీ తెలిపింది.
మార్చి 27-30 వరకూ తూర్పు తెలంగాణ ప్రాంతంలో ఉష్ణోగ్రత 41-43 డిగ్రీల వరకూ నమోదవుతుందని హెచ్చరిక జారీ అయింది. హైదరాబాద్లో కూడా ఉష్ణోగ్రత పెరగనుంది. 38-40 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ నుంచి వడగాలులు తీవ్రత పెరుగుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది.
మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా పలు జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా అత్యవసరం అయితే తప్పించి బయటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా బయటకు వెళ్లే డీ హైడ్రేషన్ బారిన పడే అవకాశం లేకపోలేదు. దీంతో కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదు బయటకు వెళ్లేటపుడు విధిగా ఓ వాటర్ బాటిల్ క్యారీ చేయాలని చెబుతున్నారు. మొత్తంగా మఫ్లర్లు.. ఎండ తగలకుండా.. సన్ స్క్రీన్ లోషన్లతో పాటు తలపై ఏదైనా టోపీ పెట్టుకోవాలని సూచిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









