)
Telangana Rain Alert:తెలంగాణలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 14 వరకు ఉపరితల ఆవర్తన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానంగా ఈ రోజు రేపు ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటోంది. ఈ క్రమంలోనే ఇవాళ ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
అంతేకాదు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.ఈ మేరకు ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే హైదరాబాద్లో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇలా వుండగా నిన్న పిడుగులు పడి తెలంగాణ వ్యాప్తంగా ముగ్గురు మృతి చెందారు. పలువురు ప్రమాదబారిన పడ్డారని సమాచారం. వర్షం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం
ముఖ్యంగా మొన్నటి వరకు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన మూలంగా తెలంగాణతో పాటు ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మత్స్య కారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అటు వాగులు, వంకలు, నదీ పరివాహాక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. అటు భారీ వర్షాల నేపథ్యంలో పలు స్కూల్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.