)
CM Revanth On Hyderabad Rains: మూసీ ముంచెత్తడంతో ఎంజీబీఎస్ బస్ స్టాప్ కూడా పూర్తిగా జలమయం అయిపోయింది. అయితే హైదరాబాద్ వ్యాప్తంగా వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ తీవ్ర ట్రాఫిక్ జామ్ తో పాటు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూసీకి వరద పోటెత్తడంతో అధికారులతో కీలక సూచనలు చేశారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని.. ఎంజీబీఎస్ లో నీరు చేరుతుండడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులకు ప్రత్యామ్నాయ మార్గాల్లో తరలించాలని సూచించారు. నీళ్లు నిలిచే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాట్లు చేయాలని కూడా అన్నారు.
తెలంగాణలో వర్షాలు భారీగా పడుతూనే ఉన్నాయి. ప్రధానంగా మహబూబ్ నగర్, భద్రాద్రి, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో ఈ ఉదయం నుంచి కూడా వానలు పడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లి చెరువులు మత్తడి దూకుతున్నాయి. మరోవైపు హుస్సేన్ సాగర్ జలాశయంలో కూడా నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం 925 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తుండగా 1600 అవుట్ ఫ్లో ద్వారా విడుదల చేస్తున్నారు. నీటిమట్టం స్థిరంగా ఉండేలా అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
ఇక మూసీ పరివాహక ప్రాంతాల్లో వీధులన్నీ జయమలమయ్యాయి. వరద ఉధృతికి ఇంట్లోని సామాన్లు కూడా కొట్టుకుపోయాయి. ఐదు అడుగుల మేర వరద ప్రవాహం సాగడంతో ప్రజలు భవనాలు ఎక్కుతున్నారు. బిక్కు బిక్కుమంటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నారు. ఇక రేకుల ఇళ్లలో వారైతే ఆశ్రయం కోసం ఎదురుచూస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. పలు ప్రాంతాల్లో పది అడుగుల మేర వరద చేరడంతో ముసారంబాగ్ పాత వంతెన పై మూసీ నీళ్లు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. అక్కడ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. అంబర్పేట నుంచి దిల్షుక్ నగర్ మధ్య రహదారిని కూడా మూసివేశారు.
మూసీ ఉప్పొంగడంతో పురాణాపూల్ శ్మశాన వాటికతో పాటు పక్కనే ఉన్న పురాతన శివాలయం కూడా నీట మునిగింది. ప్రస్తుతం ప్రవాహం ఎక్కువగా లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. ముసారాంబాగ్ మూసీ నదిపై నిర్మాణంలో ఉన్న కొత్త వంతెనను జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పరిశీలించారు. ఇప్పటికే పూర్తయిన బ్రిడ్జి పనులకు ఎలాంటి నష్టం లేదని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. వరద నీరు కారణంగా కొంత స్టేజింగ్ సామాగ్రి కదలిందని స్పష్టం చేశారు.
హైదరాబాద్ వరద బాధితులకు అండగా..
ఇక హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీ ఎంజీబీఎస్ పరిసర ప్రాంతాలు నీట మునిగాయని ఏపీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలు మొదలుపెట్టింది. ప్రభుత్వ సూచనలు వాతావరణ హెచ్చరికలు అనుసరించి వరద బాధితులకు ధైర్యం చెప్పి వారికి అవసరమైన ఆహారం అందించే కార్యక్రమాల్లో పాల్గొనాలని జనసేన తెలంగాణ నాయకులు, శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి