)
Himayat Sagar: హైదరాబాద్ చుట్టు పక్కల మూసీ పరివాహాక ప్రాంతాల్లో భారీ వర్షాల వలన మూసీ నదికి వరద పోటెత్తుతుంది. మరోవైపు మూసీ నది పరివాహాక ప్రాంతాల్లో ఉన్న హైదరాబాద్ జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్ సాగర్ లో అంతకంతకు నీటి మట్టం పెరుగుతుంది. జలాశయాల్లో నీటిమట్టం పెరగడంతో అప్రమత్తమైన అధికారులు నిన్న నాలుగు గేట్లు ఒక ఫీట్ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
ఇవాళ ఐదో గేట్ కూడా ఎత్తి నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. వరద నీరు హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డుపై నుండి వెళ్తుండడంతో రాకపోకలు నిలిపివేశారు. రాజేంద్రనగర్ నుంచి అప్పా జంక్షన్ వెళ్లేవారు, అప్పా జంక్షన్ నుంచి రాజేంద్రనగర్ వచ్చేవారు బండ్లగూడ, కిస్మత్పూర్ బుద్వేల్ నుంచి వెళ్లాలని పోలీసులు సూచించారు.
వరద నీరు ప్రవహిస్తున్న ప్రాంతంలో హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతాల వద్ద కూడా సెల్ఫీలు దిగడానికి ప్రజలు రావొద్దని పోలీసులు సూచిస్తున్నారు.దీంతో మూసీ పరివాహాక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. చాలా యేళ్ల తర్వాత హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవల్ కు చేరుకుంది. అటు మూసీ పరివాహాక ప్రాంతాల్లోని ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అటు హిమాయత్ సాగర్, మూసీ, ట్యాంక్ బండ్ పరివాహాక ప్రాంతాల్లో ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో మళ్లీ భారీ వర్షాలు పడితే.. లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కు బిక్కు అనాల్సిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.