మోడీతో ముడిపడిన హైద్రాబాద్ మెట్రో ప్రారంభోత్సవం

Last Updated : Sep 26, 2017, 07:35 PM IST
మోడీతో ముడిపడిన హైద్రాబాద్ మెట్రో ప్రారంభోత్సవం

హైద్రబాద్ మెట్రో ప్రారంభోత్సవం ప్రధాని మోడీతో ముడిపడిఉంది. నవంబర్ 28న ప్రారంభించాలని భావిస్తున్న టి.సర్కార్ .. ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రధాని మోడీకి ఆహ్వానం పలికారు. అయితే ఇప్పటి వరకు ప్రధాని కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. సమాచారం అందిన వెంటనే ప్రారంభోత్సవం తేదీని అధికారికంగా ప్రకటిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సికింద్రాబాద్ ఓలిఫెంటా వద్ద మెట్రో ఎండీ ఎన్ వీఎస్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ తో కలిసి మెట్రో ట్రాక్ పనులను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రెండో దశపై ప్రణాళికలు రూపొందించామన్నారు. అయితే దీనిపై మంత్రి మండలిలో చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

నవంబర్ 28 నుంచి 30 వరకు హైదరాబాద్ లో జరిగే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా మెట్రో రైలు ప్రారంభించాలని భావిస్తున్న సర్కార్ ఈ మేరకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోంది.

Trending News