)
Hyderabad Metro:హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశ నిర్వహణ బాధ్యతల నుంచి నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ తప్పుకోబోతోంది. ఇక నుంచి తెలంగాణ ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టు రాబోతోంది. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి, ఎల్ అండ్ టీ సీఎండీ మధ్య అంగీకారం కుదిరింది. దీంతో హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసినట్లైంది.
ఎల్ అండ్ టీ గ్రూప్ CMD S.N. సుబ్రహ్మణ్యన్ తోపాటు, సంస్థ అధికారులు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, ఎల్ అండ్ టీ ఒక అభిప్రాయానికి వచ్చారు. ఇందులో భాగంగా ఎల్అండ్టీకి ఉన్న రూ. 13వేల కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో పాటు, ఎల్అండ్టీకి రూ. 2,100 కోట్లు నగదు చెల్లించేందుకు కూడా రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది.
దీంతో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ నిర్మాణం వేగవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి భారత ప్రభుత్వ ఆమోదం పొందేలా చేయాలనే లక్ష్యంతో ఇరుపక్షాల మధ్య చర్చలు జరిగిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో 69 కిలోమీటర్ల మొదటి దశని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ. 22 వేల కోట్ల రూపాయలతో నిర్మించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.