)
Hyderabad metro rail services extends due to ganesh immersion: దేశమంతట కూడా గణపయ్య విగ్రహల నిమజ్జనాలు ఎంతో కన్నుల పండుగగా జరుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ గణపయ్య నిమజ్జనం ఈసారి గతంలో కంటేమరింత వేగంగా జరుగుతుంది. అనుకున్నట్లుగానే ఖైరతాబాద్ గణపయ్య సైతం ఈసారి తొందరగా గంగమ్మ ఓడిలో చేరిపోయాడు. మరోవైపు ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో ప్రస్తుతం హైదరాబాద్ లో ఏ రోడ్లో చూసిన గణపయ్య విగ్రహాల శోభయాత్ర కన్పిస్తుంది.అంతే కాకుండా.. రోడ్లన్ని కూడా నిమజ్జనం ను దగ్గర నుంచి చూసేందుకు వచ్చిన భక్తులతో కిట కిటలాడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఆర్టీసీతో పాటు మెట్రో అధికారులు సైతం ఇప్పటికే రాత్రి 1. 30 నిముషాల వరకు మెట్రోలను నడ్పిస్తున్నట్లు చెప్పారు. కానీ ప్రస్తుతం ఎక్కడ చూసిన భారీగా జనాలు కన్పిస్తున్నారు.
మెట్రోలు అన్ని కూడా భక్తులతో ఫుల్గా రష్ గా ఉన్నాయి. ఈ క్రమంలో మెట్రో అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు . ఈ రోజు రాత్రంత కూడా మెట్రో రైళ్లను నడ్పిస్తున్నట్లు ప్రకటించారు. భక్తుల సౌకర్యార్థం తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రోడ్లన్ని బ్లాక్ అయిపోవడం వల్ల చాలా మంది కూడా మెట్రోలోనే ప్రయాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా మెట్రో అధికారులు ఈ నిర్ణయంను తీసుకున్నారు.
ఇదిలా ఉంటే.. వినాయక నిమజ్జనాల నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను కొనసాగుతున్నాయి. రేపు(ఆదివారం) ఉదయం 10 గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇక హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు ఆదివారం మొత్తం కొనసాగే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే లారీలు వంటి భారీ వాహనాలకు కూడా నగరంలోకి ఎంట్రీ ఉండదని చెప్పారు. కేవలం ఔటర్ రింగ్ రోడ్డు వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook