Rohingya muslims in Hyderbad: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఆపరేషన్లో సంచలన నిజాలు బయటపడ్డాయి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ చెబుతున్నట్టుగానే పాతబస్తీలో భారీగా రోహింగ్యాలు నివాసం ఉంటున్నట్లు జీ న్యూస్ చేపట్టిన ఆపరేషన్ లో తేలింది. కేవలం మ్యాన్ మార్ (బర్మా), బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్ కు వారు వలస వచ్చినట్లు తేలింది.
స్థానికంగా 12 వందల కుటుంబాలు ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.
అయితే అనధికారంగా వారి సంఖ్య 40 వేల కు పైగానే ఉంటుందని తెలుస్తోంది. వారిలో కొంత మందికి UNCHR అధికారికంగా శరణార్థి సర్టిఫికెట్ల జారీ చేసినట్లు తెలుస్తోంది. దీని వెనక అక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యే, ఎంపీ మద్దతు ఉందనేది బహిరంగ సత్యం. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు పాతబస్తీకి చెందిన ఎంఐఎం పార్టీ కి తలొగ్గి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మన రాష్ట్రంలో అక్రమంగా వలన ఉంటున్న రోహింగ్యాల విషయంలో చూసీచూడనట్టు వ్యవహరించిందనేది బీజేపీ నేతలు చెబుతున్న మాట.
ముఖ్యంగా పాతబస్తీలోని చాంద్రాయణ గుట్ట, బాలాపూర్, ఆషామాబాద్, కాలా పత్తర్, ఫలక్ నుమా, బార్కాస్, షాహిన్ నగర్ వంటి ప్రాంతాల్లో వీళ్లు ప్రముఖంగా ఉన్నారు. ముఖ్యంగా మన దేశానికి చెందిన వారైతే ఎక్కువ డబ్బులకు పనిచేస్తారు. వీళ్లు మాత్రం ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. అది అక్కడ ముస్లిమ్స్ కు వరంగా మారింది. కొంత మంది సంపన్న ముస్లిమ్స్ తక్కువ జీతానికి వస్తున్నారని వీరిని తమ దగ్గర పనిలో పెట్టుకున్నారు. ఇలా పనిచేస్తున్న వారిలో స్లీపర్స్ సెల్స్ కూడా ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలో రేవంత్ రెడ్డి సర్కారు.. ఓటు బ్యాంక్ కోసం ఎంఐఎం చెప్పినట్టే నడుచుకుంటుందని కమలం పార్టీ నేతలు చెబుతున్నారు. వారి చెబుతున్నది నిజమనే విషయం జీ తెలుగు న్యూస్ ఆపరేషన్ లో బయటపడింది.
ముఖ్యంగా ఈ రోహింగ్యాలు బర్మా దేశంలో వాళ్లు చేస్తోన్న అరాచకాలు భరించేలేక అక్కడునున్న బుద్ధిస్టులు వారిని తన్ని తరిమేసారు. వీరు మన దేశంలో పశ్చిమ బంగాల్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల గుండా మన దేశంలోకి ప్రవేశిస్తున్నారు. ఇక్కడ కొంత మంది దేశ ద్రోహుల కారణంగా ఇక్కడి ఆధార్, ఓటర్ కార్డులను పొందుతున్నారు. ఇక అస్సామ్ లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, పశ్చిమ బంకలోని మమతా బెనర్జీ వీళ్లు రోహింగ్యాలని తెలిసినా.. తమ పార్టీకి ఓటు వేస్తారనే ఉద్దేశ్యంతో వారిని చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు.వీరు మెల్లగా మెజారిటీ ప్రాంతాలైన హిందువులు ఉండే ప్రాంతాల్లో వచ్చి అన్ని రకాల వ్యాపారాలను చేజిక్కించుకుంటున్నారు. మొత్తంగా కొన్ని పార్టీల నిర్వాకం వల్ల వీరిని గుర్తించడం కష్టమవుతుంది. అందుకే భారత ప్రభుత్వం అక్రమంగా భారత్ లో స్థిర నివాసం ఉంటున్న వారిపై కఠినంగా వ్యవహరించడంతో వారి దేశాలకు డిపోర్ట్ చేసే పనిలో పడింది. మరి హైదరాబాద్ లో అక్రమంగా రాజ్యమేలుతున్న రోహింగ్యాలను ఏ రకంగా వాళ్ల దేశానికి డిపోర్ట్ చేస్తారన్నది చూడాలి.
Also Read : అప్పట్లో విమాన ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ చిరు, బాలయ్య.. అసలు ఏం జరిగిందంటే..
Also Read : ప్రైవేట్ జెట్లో ప్రయాణించే ఏకైక శాండల్వుడ్ నటి.. వందల కోట్ల ఆస్తులు ఉన్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









