Hyderabad: రన్నింగ్ ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన కేటుగాడు..

rape attempt in mmts train: ఎంఎంటీఎస్ ట్రైన్ లో యువతిపై అత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే పోలీసులు అనేక బృందాలుగా విడిపోయి దీనిపై విచారణ చేపట్టారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 25, 2025, 03:24 PM IST
  • యువతిపై అఘాయిత్యం ఘటన..
  • నిందితుడ్ని గుర్తించిన పోలీసులు..
Hyderabad: రన్నింగ్ ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన కేటుగాడు..

Hyderabad police identified mmts accused: హైదరాబాద్ లో యువతిపై ఎంఎంటీఎస్ ట్రైన్ లో అత్యాచార యత్నం ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. దీనిపై అన్ని రాజకీయా పార్టీలు సైతం స్పందించాయి. ప్రస్తుతం యువతిని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేయడంతో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై తొలుత యువతి తాను ట్రైన్ నుంచి పడిపోయానని పోలీసులకు చెప్పింది.

Add Zee News as a Preferred Source

ఆ తర్వాత ఆమె ఇంట్లో వాళ్లు రావడంతో ధైర్యం తెచ్చుకుని అసలు విషయం బైటపెట్టింది. యువతి మేడ్చల్ కు చెందిన యువతి.. సికింద్రాబాద్ లో తన ఫోన్ రిపేర్ కోసం వెళ్లింది. పని ముగించుకుని తిరుగు ప్రయాణంలో మేడ్చల్ ట్రైన్ ఎక్కింది. ఈ క్రమంలో మహిళల భోగీల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఇద్దరు అల్వాల్ లో దిగిపోయారు. దీంతో అప్పటికే మహిళల భోగీలో కూర్చున్న సదరు కేటుగాడు.. యువతి దగ్గరకు వెళ్లి ఆమె చెయ్యిపట్టుకుని బలవంతం చేశాడు. తన గదికి రావాలని ఆమెను వేధించాడు. అతడ్ని మాటలో పెట్టిన యువతి.. ఒక్కసారిగా కొంపల్లీ సమీపంలో ట్రైన్ నుంచి కిందకు దూకేసింది.

ఈ క్రమంలో యువతిని గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆతర్వాత జీఆర్పీ పోలీసులు ఘటనపై ఆరా తీశారు. ఈ క్రమంలో యువతి తనపై అత్యాచార యత్నం జరిగిందని చెప్పింది. వెంటనే అనేక బృందాలుగా పోలీసులు అన్ని రైల్వేస్టేషన్ లలో సీసీఫుటేజీలను జల్లెడపట్టారు. దీనిలో మేడ్చల్ జిల్లా గౌడపల్లి గ్రామానికి చెందిన మహేష్ వ్యక్తిని గుర్తించారు. సదరు వ్యక్తిని ఏడాది క్రితం అతని భార్య వదిలేసినట్లు సమాచారం. ఇతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.  

Read more: Hyderabad: ఎంఎంటీఎస్ రైల్లో అత్యాచార యత్నం... బాధితురాలిని యశోద ఆస్పత్రికి తరలింపు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..

మరోవైపు కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలంగాణలో మహిళల భద్రతకు ఏ మాత్రం సెఫ్టీలేకుండా పోయిందన్నారు. తెలంగాణ ఇప్పటికి హోంశాఖలేదన్నారు.దీనిపై ఇప్పటికి కూడా తెలంగాణ సర్కారు స్పందిచకపొవడం బాధాకరమన్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News