)
SLBC Project: 'రాజకీయ నాయకులు టెక్నికల్ సర్వే చేయడం మొదటిసారి. కెప్టెన్ హెలికాప్టర్ నడిపించారు. వాటర్లో నీళ్లు కలిపే మంత్రి సర్వే చేశారు. రేవంత్ రెడ్డి రోత మాటలు మాట్లాడారు. ఎస్ఎల్బీసీపై కాంగ్రెస్, టీడీపీ హయాంలోనే తెలంగాణకు నష్టం జరిగింది. దత్తత పేరుతో సమైక్య పాలకులు కోతలు కోశారు. నీళ్ల శాఖ మంత్రికి జ్ఞానం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీళ్లు అంటే భయం. ఇరిగేషన్ సబ్జెక్ట్ అంటే భయం' అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు.
'చెప్పు దెబ్బకి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా? కేసీఆర్ సీఎం అయ్యాక కృష్ణా జలాల వాటా కోసం కమిషన్ వేయించారు. ఎస్ఎల్బీసీలో శవాలను బయటకు తీయలేని వాళ్లు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. సర్వే చేయకుండా కమీషన్ల కోసం ఎస్ఎల్బీసీ పనులు చేశారు. జానారెడ్డి, త్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే ఎస్ఎల్బీసీపై అసెంబ్లీలో కేసీఆర్ చర్చించారు' అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. 'నల్గొండ జిల్లాలో ఇద్దరు మొనగాళ్లు మంత్రులుగా ఉన్నారు. కృష్ణానదిలో 500 టీఎంసీలు తెలంగాణకు తీసుకురాకుండా రెండేళ్లుగా ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు.
తెలంగాణ నీళ్లను గురుదక్షిణ కింద చంద్రబాబుకు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ఎవరు? అని మాజీమంత్రి జగదీష్ రెడ్డి నిలదీశారు. శక్తికి మించిన పదవి రేవంత్ రెడ్డికి వచ్చింది. భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదు. రేవంత్ రెడ్డి పాత గురువు చంద్రబాబు, కొత్త గురువు కాంగ్రెస్ నిర్వాకంతోనే పాలమూరుకు నీళ్లు రాలేదు' అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వివరించారు. పదవుల కోసం.. పైసల కోసం అమ్ముడుపోయిన చరిత్ర రేవంత్ రెడ్డిది అని ప్రకటించారు.
'ఉమ్మడి ఏపీలో బీఫామ్ల కోసం, తెలంగాణలో పదవి కాపాడుకోవడం కోసం మోడీతో మిలాఖత్ అయ్యారు. చంచల్గూడ, చర్లపల్లి జైల్లో ఉన్న పరిచయాలతో తెలంగాణ ప్రజల జేబును కొడుతున్నారు' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. బస్సు ప్రమాదం జరిగితే రేవంత్ రెడ్డి ఎందుకు పోలేదు? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 'రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ధాన్యాన్ని సకాలంలో ప్రభుత్వం కొనడం లేదు. రైతులు దళారులకు పంటను అమ్మేలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. ప్రైవేటు కళాశాలలు బంద్.. మరోవైపు పత్తి మిల్లులు బంద్. కానీ రేవంత్ రెడ్డి, మంత్రులు గాలి మొటార్లలో తిరుగుతున్నారు' అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. 'ఢిల్లీలో రేవంత్ రెడ్డి, మంత్రులు జల్సాల్లో ఉన్నారు. రాష్ట్రంలో 50 శాతం క్రైమ్ రేట్ పెరిగింది. సర్వేలు చాలామంది చేస్తారు. సర్వేలతో బీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం? ఒక్క పథకం ఆపుతున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించాలి. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయం' అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి