)
Jangoan Bus Accident: చేవెళ్ల బస్సు ప్రమాద దుర్ఘటన గురించి మరువక ముందే రాష్ట్రంలో మరో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. తెలంగాణలోని జనగామ జిల్లా రఘునాధపల్లి మండలం, నిడికొండ వద్ద ఈ తెల్లవారుజామున ఉదయం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ రాజధాని బస్సు టీజీ 03Z0046 ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణీకులు దుర్మరణం చెందగా... మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి బస్సు ఎడమ భాగం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఇక ఈ మృతుల్లో ఒకరు దుండిగల్, మరొకరు హనుమకొండకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని ఇక ప్రమాదం గురించి ఆరా తీస్తున్నారు.
ఈ ఘోర బస్సు ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ బస్సు ప్రమాదం హనుమకొండ నుంచి హైదరాబాద్ వస్తుండగా జరిగింది. ఇక మృతులు ఓం ప్రకాష్, నవదీప్ సింగ్గా గుర్తించారు. రాష్ట్రంలో వరుస ఘోర బస్సు ప్రమాదాలు ప్రయాణీకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసేలా ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook