)
Jubilee Hills By Poll 2025: దేశ వ్యాప్తంగా బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బిహార్ లో ఈ నెల 6తో పాటు ఈ నెల 11న రెండు విడదల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక తెలంగాణలోని జూబ్లిహిల్స్ లో ఈ నెల నవంబర్ 11 ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నిక సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ బై పోల్ జరగుతుంది. ఈ ఉప ఎన్నికను బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సీరియస్ గా తీసుకొని బరిలో దిగుతున్నాయి. అయితే బీఆర్ఎస్ అందరి కంటే ముందుగా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను అభ్యర్ధిగా బరిలో నిలిపింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ స్థానికుడైన నవీన్ యాదవ్ కు టికెట్ కేటాయించింది. ఈయనకు ఎంఐఎం పార్టీ మద్దతు పలికింది. గతంలో ఆ పార్టీలో పనిచేసిన వ్యక్తి. పైగా నవీన్ యాదవ్ ఎంఐఎం తన పార్టీ కార్యాలయం దారుస్సలాంలో నిర్ణయించింది. బీజేపీ తరుపున గతంలో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డినే తమ అభ్యర్ధిగా జూబ్లీ హిల్స్ బై పోల్ లో నిలిపింది.
ఈ సంగతి పక్కన పెడితే.. 2023లో జరిగిన ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంది. కాంగ్రెస్ అధికారంలోఉన్నప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ గ్రాఫ్ చూసుకుంటే ఎక్కడ కూడా మనం కాంగ్రెస్ అనేది లేదు. మొన్న జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలవడం పెద్ద ఊరట. ఇక జూబ్లీ హిల్స్ బై పోల్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ సహా కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఇక్కడ జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం దిగిపోవాలనే అసమ్మతి నేతలు మరింతగా పెరుగుతారు. చివరి నిమిషంలో రేవంత్ రెడ్డి కూడా బరిలో దిగి ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఇది లిట్మస్ టెస్ట్ అని చెప్పాలి. స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తోన్న రేవంత్ రెడ్డి.. ఈ ఉప ఎన్నికను ఎదుర్కొవాల్సి వస్తోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో గెలవడానికి అజారుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెట్టడంలో వాళ్ల ఓట్లు గంప గుత్తగా తమకే వస్తాయనేది రేవంత్ ధీమా. పైగా ఎన్నికల్లో బీజేపీ విమర్శించే నెపంలో భారత్ దేశాన్ని తక్కువ చేసి రేవంత్ మాట్లాడంపై ప్రజల్లో ఆయన ఇమేజ్ పలచన అయింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా దిగజారి మాట్లాడటం ఏమిటనే ప్రశ్నలు నెటిజన్లు వేస్తున్నారు.
రేవంత్ రెడ్డి ముస్లిమ్స్ జపం చేస్తోన్న వాళ్లు మాత్రం బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు పలు సర్వేలు చెబుతున్నాయి. బిఆర్ఎస్ పార్టీమాత్రం ముందుగానే అభ్యర్థిని ప్రకటించింది.సైలెంట్ గా వాళ్లు డోర్ టు ప్రచారం చేసుకుంటున్నారు. బిజెపీ ఎప్పట్లాగే ఆఖరి నిమిషం వరకు అభ్యర్థిని ప్రకటించడంలో ఆలస్యం చేసింది. 2023 లో పోటీ చేసిన అభ్యర్థినే రంగంలో దింపింది. ప్రచారంలో వెనకపడిపోయింది. తాజాగా ఓ సర్వే రిపోర్ట్ బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండబోతున్నట్టు చెబుతుంది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కంటే 10 శాతం తక్కువ ఓట్లు పోలయ్యే అవకాశాలున్నాయట. బీజేపీ ఓటర్లు చాలా మంది బీఆర్ఎస్ అభ్యర్ధికి ఓటు వేసేందుకు రెడీ అవుతున్నారట. మొత్తంగా నవంబర్ 14న రిజల్ట్ రోజున మనం అదే ఫలితం దాదాపు వెల్లడి కాబోతున్నట్టు సమాచారం.
నవీన్ యాదవ్ మీద బిఆర్ఎస్ కౌంటర్ స్ట్రాటజీగా ఒక రౌడీ షీటర్ కి టికెట్ ఇస్తారా ..? క్యాండిడేట్ మీకు ఎవరూ దొరకలేదా అతన్ని గెలిపిస్తే గనుక జూబ్లీహిల్స్ లాంటి ఏరియా అంతా కూడా రౌడీ షీటర్స్ మయం అవుతుంది. లేదు హైడ్రా వచ్చి మీ బిల్డింగులు కూల్చేస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ హామీలు అమలు పరచలేదు. 2 వేల పెన్షన్ ని 4000 పెన్షన్ చేయలేదు. తులం బంగారం ఇలాంటివన్నీ కూడా స్లమ్ ఏరియాస్ లోకి తీసుకెళ్ళటంలో బిఆర్ఎస్ సక్సెస్ అయింది. ఈ ముస్లిమ్స్ కి సంబంధించి షాదీ ముబారక్ ఇట్లాంటివన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వట్లేదనే ప్రచారంలో ముందుంది. మొత్తంగా ఈ ఉప ఎన్నికల్లో ఎవరు గెలిచానా.. ? తెలంగాణ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook