K Kavitha Bhadrachalam Visit: 'కళ్ల ముందే మన తెలంగాణ ఆగమవుతుంటే చూస్తూ ఊరుకోవద్దు' అని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేసి మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేందుకు పని చేయాలని దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పాలకులు చూడడానికి తెలంగాణ వ్యక్తుల్లా ఉంటారు. కానీ పనిచేసేది తెలంగాణకు వ్యతిరేకంగా అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అనేక కల్లిబొల్లి మాటలు చెప్పింది.. లేనిపోని హామీ ఇచ్చి మోసం చేసిందని కవిత విమర్శించారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రారావు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ద్రోహి అని మండిపడ్డారు. భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే గెలుపు బీఆర్ఎస్ పార్టీదేనని జోష్యం చెప్పారు.
Also Read: KT Rama Rao: 'రేవంత్ రెడ్డిని గెలిపించి తినే పళ్లెంలో మట్టి పోసుకున్నాం': కేటీఆర్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రెండు రోజుల పాటు సుడిగాలి పర్యటన చేపట్టారు. సోమవారం భద్రాచలం ఆలయంలో సీతారాములను దర్శించుకున్న అనంతరం పట్టణంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు ఉద్యమకారులతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ విజయవంతం, పార్టీ బలోపేతంపై పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.
Also Read: Telangana Diagnostics: గతం కన్నా తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్స్ వైద్య సేవలు
'కేసీఆర్, పార్టీ కార్యకర్తలకు వారిధిగా ఉంటాను. కార్యకర్తల సమస్యలను కేసీఆర్ దృష్టికి నేను తీసుకెళ్తాను. ఏ చిన్న అవసరమున్నా నన్ను కార్యకర్తలు సంప్రదించవచ్చు' అని ఎమ్మెల్సీ కవిత సూచించారు. కార్యకర్తలను కాపాడుకోవడాన్ని బాధ్యతగా భావిస్తానని ప్రకటించారు. తెలంగాణను కాపాడడమే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ప్రథమ కర్తవ్యమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణను కాపాడే బాధ్యత బీఆర్ఎస్ పార్టీకే ఉంటుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు.
ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులున్నా మూడు పైసలు తేలేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఆత్మీయ భరోసా కింద నిరుపేదలకు డబ్బులు ఇవ్వకుండా రేవంత్ రెడ్డి మోసం చేశాడని ఆరోపించారు. 'మన కళ్ల ముందే మన తెలంగాణ ఆగమవుతుంటే చూస్తూ ఊరుకోవద్దు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించాల్సిన అవసరం ఉంది' అని పార్టీ శ్రేణులకు బాధ్యత గుర్తుచేశారు. అప్పులపై మల్లు భట్టి విక్రమార్క విపరీతమైన అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు, పార్టీ శ్రేణులకు కవిత పిలుపునిచ్చారు.
'అన్ని రంగాల్లో తెలంగాణను నెంబర్ వన్గా నిలబెట్టిన ఘనత కేసీఆర్ది. రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్క సెకండ్ కూడా విశ్రాంతి తీసుకోకుండా కేసీఆర్ పని చేశారు. సీతారామ ప్రాజెక్టును నిర్మించి 3.5 లక్షల ఎకరాలకు కేసీఆర్ నీళ్లు అందించారు' అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గుర్తుచేశారు. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామరక్ష అని ప్రకటించారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రారావు అలాంటి ద్రోహులను చాలా చూశాం... కుట్రలను చూశామని తెలిపారు. మోసం చేయడం కాంగ్రెస్ నైజం అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









