)
Kaleshwaram Report: కాళేశ్వరం రిపోర్ట్ కొట్టేయండి అంటూ కేసీఆర్, హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ బెంచ్.మాజీ సీఎం బీఆర్ఎస్ ఛీఫ్ కేసీఆర్ తరపు వాదనలు వినిపిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ సుందరం శేషాద్రి నాయుడు.పీసీ ఘోష్ తరఫు వాదనలు వినిపిస్తున్న నిరంజన్ రెడ్డి జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక అక్రమమంటూ మాజీ సీఎం కేసీఆర్, హరీశ్రావు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. నివేదిక తమ పరువుకు నష్టం కలిగించేలా, ఏకపక్షంగా ఉందని, రిపోర్ట్ను కొట్టివేయాలంటూ కోర్టు గుమ్మం ఎక్కారు. నివేదికకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు. కానీ నివేదిక ను ముఖ్యమంత్రులు, మంత్రులు మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించారన్నారు. ఇది తమ పేరు, ప్రతిష్ఠలను దెబ్బతీయడమే పనిగా పెట్టుకున్నట్టు కోర్టుకు తెలిపారు
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే కదా.
కాళేశ్వరంపై విచారణ కమిషన్ వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 6 చెల్లదని.. ఎలాంటి అధికార పరిధి లేకుండానే, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్-1952కు విరుద్ధంగా సదరు జీవో ఇచ్చారని పిటిషన్లలో కేసీఆర్, హరీశ్రావు ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలకు వ్యక్తిగతంగా ఎవరు బాధ్యులో తేల్చాలని జీవోలో ఉందన్నారు. అసలు జ్యుడీషియల్ విచారణ చేసే అధికారం విచారణ కమిషన్లకు ఉండదనే విషయాన్ని పట్టించుకోలేదని కోర్టుకు వివరించారు. గతంలో జరిగిన విషయాలకు ఎవరు బాధ్యులని తేల్చడం విచారణ కమిషన్ అధికార పరిధిలోకి రాదంటూ వారు తమ లాయర్ తరుపున వాదనలు వినిపించనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.