తిరుమలలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు రాజ మర్యాదలు !!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు

Last Updated : May 27, 2019, 11:06 AM IST
తిరుమలలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు రాజ మర్యాదలు !!

తెలంగాణ సీఎం కేసీఆర్  తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించిన కేసీఆర్ కు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన  కుటుంబసభ్యులతో కలిసి ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తిరుమల విచ్చేసిన తెలంగాణ సీఎంకు టీడీపీ అధికారులు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించారు. మరోవవైపు ముఖ్యమంత్రి పర్యటనకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో తిరుమలలో పలు చోట్ల ఆంక్షలు విధించారు.

స్వాగతం పలికేందుకు క్యూకట్టిన నేతలు

తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన అనంతరం కేసీఆర్‌ తొలిసారి స్వామి దర్శనానికి వచ్చారు. స్వామి దర్శనార్థం ఆదివారం సాయంత్రానికే కేసీఆర్‌ తిరుమల చేరుకున్నారు. రేణికుంట విమానాశ్రయానికి చేరుకున్న కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు క్యూకట్టారు. కేసీఆర్ కు ఘన స్వాగతం పలికిన వారిలో వైసీపీ ఎంపీ రెడ్డెప్ప సహా ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఆదిమూలం, నారాయణస్వామి, నవాజ్‌బాషా, నాయకులు ఎమ్మార్సీరెడ్డి, జయచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. 

Trending News