)
Raj Gopal Reddy: అధికార పక్షంలో ప్రతిపక్షంగా మారిన కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గానికి చెందిన ముఖ్యమైన ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆ పని జరగాలంటే ప్రభుత్వం మారాల్సిందేమోనని పేర్కొన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు నత్తనడకన కొనసాగుతుండడం.. ఆ ప్రాజెక్టులో తన నియోజకవర్గంలో భూసేకరణ జాప్యంపై రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో ఆదివారం త్రిబుల్ ఆర్ భూ నిర్వాసితులతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమావేశమై చర్చించారు. త్రిబుల్ ఆర్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న చౌటుప్పల్ డివిజన్ (ఉత్తర భాగం) రైతులు తొక్కని గడపలేదని.. ఢిల్లీ పెద్దలను కలిసినా న్యాయం జరగడం లేదని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. దివీస్ యాజమాన్యం కోసం కేసీఆర్ ప్రభుత్వంలో అలైన్మెంట్ మార్చారని.. ఇప్పుడు దక్షిణ భాగం అలైన్మెంట్ మారాలంటే ఉత్తర భాగం మారాలని పేర్కొన్నారు. ఉత్తర భాగం మారాలంటే ప్రభుత్వమే మారాలేమో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని అసహనం వ్యక్తం చేశారు.
'నాకు అన్యాయం జరిగినా ఊరుకుంటా. ప్రజలకు నష్టం జరిగితే ఎంత దూరమైనా వెళ్తాను' అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. అవసరమైతే ట్రిబుల్ ఆర్ రద్దయినా సరే భూ నిర్వాసితులకు అన్యాయం జరగనివ్వనని తెలిపారు. ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తే సమస్య పరిష్కారం అవుతుందని సొంత ప్రభుత్వంపై రాజగోపాల్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. 'ప్రజలే నా బలం.. బలగం. వారి కోసం ఎలాంటి పోరాటానికైనా.. అవసరమైతే ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధం' అని ప్రకటించారు. దీనికి ప్రజలు కూడా సిద్ధం కావాలని తెలిపారు.
'లాలూచీపడి రేవంత్ రెడ్డి దగ్గరకు వెళ్లి పదవి ఇస్తే చప్పుడు చేయకుండా కూర్చోను' అని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తనకు మునుగోడు ప్రజలే ముఖ్యమని స్పష్టం చేశారు. 'భూమికి రైతుకు మధ్య భావోద్వేగ అనుబంధం ఉంటుంది. భూమి అంటే ఒక స్టేటస్. త్రిబుల్ ఆర్లో భూములు కోల్పోవడంపై కేంద్ర మంత్రులను కూడా కలుస్తా' అని రాజగోపాల్ ప్రకటించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.