)
Rajagopal reddy reacts on deputy cm Bhatti vikramarka comments: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తరచుగా మంత్రి పదవిపై చేస్తున్న కామెంట్స్ పొలిటికల్ గా కాకరేపుతున్నాయి. అంతే కాకుండా.. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తనకు మంత్రి పదివి ఇస్తానంటేనే కాంగ్రెస్ లోకి చేరినట్లు చెప్పారు. తనకు మునుగోడు ప్రజలు మాత్రమే ముఖ్యమని, మరల కావాలంటే ఎలాంటి త్యాగానికైన సిద్దమని ఇప్పటికే తెల్చి చెప్పారు.
ఈ నేపథ్యంలో ఇటీవల డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామన్నా మాట వాస్తవమన్నారు. కానీ సామాజిక సమీకరణాలతో ఆయనకు మంత్రి పదవి సాధ్యపడలేదన్నారు. ఈ క్రమంలో దీనిపై తాజాగా.. ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు మంత్రి పదవి ఇస్తామన్న హామీ అందరికి తెలిసేలా మాట్లాడినందుకు భట్టి విక్రమార్కకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. అదే విధంగా.. దీన్ని అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్య నేతలు అడ్డుకుంటూ, అవమానిస్తున్న వాస్తవాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించినందుకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పారు.
అంతే కాకుండా.. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని.. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు అమలు చేయాలని, అవినీతి రహిత పాలన అందించాలని కోరుతున్నట్లు చెప్పారు.
తెలంగాణ సమాజ ఆకాంక్షలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉండాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ తనకు మంత్రి పదవి వస్తే.. అది ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆయన చేసిన ట్విట్ మరోసారి పొలిటికల్స్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook