)
Komatireddy Rajagopal reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సొంత పార్టీపై హాట్ కామెంట్స్ చేశారు. పార్టీని కాపాడేందుకు ఆస్తులు అమ్ముకున్నానని చెప్పారు. కానీ పార్టీ తనను మోసం చేసిందన్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. తనతోపాటు బీజేపీ నుంచి వచ్చిన వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇచ్చారు. అతని కొడుకుకి ఎంపీ టికెట్ ఇచ్చారు. తనను మాత్రం పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకుని కష్టపడిన తనను కాంగ్రెస్ మోసం చేసిందని మంత్రి పదవి ఇస్తామని మాటిచ్చి మోసం చేసిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.
తనకు మంత్రి పదవి రాకుండా కొందరు నాయకులు అడ్డుకుంటున్నాని తీవ్రంగా ధ్వజమెత్తారు.మరోవైపు అదే రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సినిమాటోగ్రఫీ సహా పలు శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు. ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చినట్టే కదా అని కాంగ్రెస్ పార్టీలోని రేవంత్ రెడ్డి వర్గం వాదిస్తోంది. ఆయన బీజేపీ తరుపున ఎమ్మెల్యేగా గెలవలేదు. అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీలో పిలిచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
ఆయన కాంగ్రెస్ పార్టీ గుర్తుపై తనకున్న పలుకుబడితో గెలిచిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. మంత్రివర్గంలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి ఇవ్వలేకనే ఆయన్ని దూరం పెట్టినట్టు చెబుతున్నారు. పైగా మంత్రి వర్గంలో రేవంత్ రెడ్డితో పాటు నలుగురు రెడ్డి మంత్రులున్నారు. వీరితో పాటు ఓసీల్లో మరో ముగ్గురు మంత్రులున్నారు. మొత్తంగా బీసీలకు, మైనారిటీకు పెద్ద దిక్కు అనే చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలో బీసీలకు మూడు మంత్రి పదవులే ఇచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇక భవిష్యత్తులో కూడా రెడ్డి, ఓసీ ఈక్వెషన్స్ కారణంగా మంత్రి పదివి రాకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.