)
Lady constable leg injured during brs ktr Karimnagar: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు కరీంనగర్ బీఆర్ఎస్ సభలో పాల్గొన్నారు.ఈ క్రమంలో కేటీఆర్ భారీ కాన్వాయ్ తో కార్లు, బైక్ ల ర్యాలీతో సభ దగ్గరకు వచ్చారు. ఇంతలో ఆయన కాన్వాయ్ లోని ఒక కార్యకర్త బైక్ వేగంగా వచ్చి అదుపుతప్పి.. అక్కడ విధుల్లో ఉన్న లేడీ కానిస్టేబుల్ ను గుద్దేసింది.ఈ ప్రమాదంలో లేడీ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.
కానిస్టేబుల్ ను పరిశీలించిన వైద్యులు ఆమె కాలు విరిగినట్లు వెల్లడించారు. దీంతో మహిళ కానిస్టేబుల్ పద్మజను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరాతీశారు. మహిళా కానిస్టేబుల్ పద్మజకు వెంటనే మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి వైద్యులను మాజీ మంత్రి కేటీఆర్ కోరారు.
మరోవైపు రేవంత్ రెడ్డి 14 నెలల పాలనలో తెలంగాణ అన్నిరంగాలలో వెనుక పడిందన్నారు. అమలుకు సాధ్యం కానీ.. 420 హమీలు ఇచ్చిన సీఎం రేవంత్ అధికారంలోకి వచ్చారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని కార్యకర్తలలో, క్యాడర్ లో జోష్ ను నింపారు. ఇప్పటికే కేసీఆర్ సైతం.. రంగంలోకి దిగడంతో.. ప్రస్తుతం బీఆర్ఎస్ క్యాడర్ ఫుల్ జోష్ గా ఉంది. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 ఏళ్లు కావోస్తుంది.
ఈ నేపథ్యంలో కరీంనగర్ వేదికగా రజతోత్సవ సభ ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ అగ్రనాయకత్వం నిర్ణయించింది. ఈ సభను మార్చి 27వ తేదీన కరీంనగర్లో నిర్వహించాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లపై చర్చించడమే కాకుండా.. ఈ సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe