KCR Kaleshwaram Enquiry LIVE: ముగిసిన కేసీఆర్ విచారణ.. 50 నిమిషాలపాటు ప్రశ్నల వర్షం..?

KCR Kaleshwaram Enquiry Live Updates: కాళేశ్వరం విచారణకు మాజీ సీఎం కేసీఆర్ బుధవారం హాజరుకానున్నారు. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ కేసీఆర్‌పై ప్రశ్నించనుంది. ఈ నేపథ్యంలోనే హైటెన్షన్ నెలకొంది. కేసీఆర్ విచారణకు సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.  

Written by - Ashok Krindinti | Last Updated : Jun 11, 2025, 01:51 PM IST
KCR Kaleshwaram Enquiry LIVE: ముగిసిన కేసీఆర్ విచారణ.. 50 నిమిషాలపాటు ప్రశ్నల వర్షం..?
Live Blog

KCR Kaleshwaram Enquiry Live Updates: కాళేశ్వరంపై విచారణ తుది దశకు చేరుకుంటోంది. బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో బుధవారం ఉదయం 11:30 గంటలకు జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ముందుకు మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌ నుంచి ఉదయం 8 గంటలకు ఆయన హైదరాబాద్‌కు బయలుదేరారు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్‌ రావు, ఎంపీ ఈటల రాజేందర్‌ను విచారించిన కమిటీ.. నేడు కేసీఆర్‌ను ప్రశ్నించనుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హరీష్‌ రావు, ఈటల ఇచ్చిన సమాచారంతోపాటు మరింత లోతుగా కేసీఆర్‌ను కమిషన్ విచారించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నేతలతో కలిసి కేసీఆర్ విచారణకు రానున్నారు. కేసీఆర్ విచారణకు సంబంధించి లైవ్‌ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
 

11 June, 2025

  • 13:51 PM

    KCR Kaleshwaram Enquiry Live Updates: 50 నిమిషాల పాటు కొనసాగిన విచారణ
    ==> కేసీఆర్‌ను ప్రశ్నించిన కమిషన్‌ చైర్మన్‌ పీసీ ఘోష్‌
    ==> కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంపై కమిషన్ ప్రశ్నలు
    ==> కమిషన్‌ ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేసీఆర్‌
    ==> ఆనకట్టల నిర్మాణ నిర్ణయం ఎవరిదన్న కమిషన్‌
    ==> రీఇంజినీరింగ్‌ గురించి వివరించిన కేసీఆర్‌
    ==> కేబినెట్‌ ఆమోదం ఉందా అని అడిగిన కమిషన్‌
    ==> కేబినెట్, ప్రభుత్వ ఆమోదంతోనే నిర్మించామన్న కేసీఆర్
    ==> అన్ని అనుమతులు తీసుకున్నామన్న కేసీఆర్‌
    ==> కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన పుస్తకాన్ని..కమిషన్‌ చైర్మన్‌ పీసీ ఘోష్‌కు అందించిన కేసీఆర్‌

  • 13:43 PM

  • 13:42 PM

    KCR Kaleshwaram Enquiry Live Updates: తెలంగాణలో నీటి లభ్యతను కాళేశ్వరం కమిషన్‌కు కేసీఆర్ వివరించినట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ను 115వ సాక్షిగా కమిషన్‌ విచారించింది. లొకేషన్స్‌ మార్పు ఎవరి ఆదేశాలతో జరిగిందని కమిషన్ ప్రశ్నించింది. ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రతి అంశం కేబినెట్ నిర్ణయం మేరకే ఫైనల్ చేశామని కేసీఆర్ చెప్పారు. 

  • 13:17 PM

    KCR Kaleshwaram Enquiry Live Updates: ప్రమాదవశాత్తూ కాలు జారిపడి సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పరామర్శించనున్నారు మాజీ సీఎం కేసీఆర్.
     

  • 13:10 PM

    KCR Kaleshwaram Enquiry Live Updates: కేసీఆర్‌ కాళేశ్వరం కమిషన్‌ విచారణ ముగిసింది. 50 నిమిషాల పాటు విచారణ కొనసాగింది. పలు అంశాలపై ప్రశ్నించారు కమిషన్‌ చైర్మన్‌ పీసీ ఘోష్‌. పలు డాక్యుమెంట్లను కమిషన్‌కు కేసీఆర్ అందించారు.

  • 12:50 PM

    KCR Kaleshwaram Enquiry Live Updates: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీని బట్టలిప్పి ప్రజాక్షేత్రంలో నిలబెట్టే విధంగా కార్యచరణ ఉంటుందని.. ఆరు గ్యారెంటీలు నెరవేర్చే వరకు వెంటబడతామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 12:11 PM

  • 12:06 PM

    KCR Kaleshwaram Enquiry Live Updates: కాళేశ్వరం కమిషన్‌ ముందు హాజరైన కేసీఆర్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆన్‌ కెమెరా విచారణకు అనుమతించాలని జస్టిస్ ఘోష్ కమిటీని కోరినట్లు తెలుస్తోంది. ఓపెన్‌ కోర్టు విచారణను కేసీఆర్ నిరాకరించినట్లు సమాచారం. 

  • 11:53 AM
  • 11:42 AM

    KCR Kaleshwaram Enquiry Live Updates: కాళేశ్వరం విచారణకు హాజరయ్యారు మాజీ సీఎం కేసీఆర్. గులాబీ బాస్ ఎంట్రీకి ముందే బీఆర్‌కే భవన్ దగ్గరకు మాజీ మంత్రులు, నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అయితే కారు దిగిన కేసీఆర్‌ను చూసిన గులాబీ దళం.. బీఆర్కే భవన్ దద్దరిల్లేలా నినాదాలు చేశారు. జై కేసీఆర్, జై తెలంగాణ అంటూ నినాదాలు మారుమోగించారు. అదే టైమ్‌లో కేసీఆర్ తన బలగాన్ని చూస్తూ.. విచారణ కోసం లోపలికి నడిచారు. 

  • 11:18 AM

  • 11:02 AM

    KCR Kaleshwaram Enquiry Live Updates: కాళేశ్వరం విచారణకు కేసీఆర్‌ కాసేపట్లో హాజరు కానున్నారు. ఎర్రవల్లి ఫాంహౌజ్ నుంచి డైరెక్ట్‌గా బీఆర్కే భవన్‌కు చేరుకున్నారు. విచారణ కమిషన్‌ ఎదుట ఓ మాజీ ముఖ్యమంత్రి హాజరు కానుండడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. కేసీఆర్ వెంట బీఆర్ఎస్ దళం ర్యాలీగా వచ్చారు.

  • 10:59 AM

    KCR Kaleshwaram Enquiry Live Updates: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి నుంచి బయలుదేరారు. బీఆర్‌కే భవన్‌లో కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యేందుకు ఆయన భారీ కాన్వాయ్‌తో బయలుదేరారు. కేసీఆర్‌తోపాటు తొమ్మిది మందిని కమిషన్‌ లోపలికి అనుమతించనుంది. 

Trending News