)
హైదరాబాద్ లో మొదలైన శోభాయాత్ర
శోభాయాత్రకు బయలు దేరిన గణనాథులు. 11 రోజుల పూజలు అనంతరం గంగమ్మ ఒడికి చేరేందుకు వినాయకులను నిర్వాహకులు తరలిస్తున్నారు. ఎంజె మార్కెట్ వద్ద భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి భారీ ఏర్పాట్లు. ప్రతి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వాగతం పలుకుతున్నారు..
భక్త జన సంద్రంగా మారిన ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు.. మధ్యాహ్నం 2 గంటల వరకు ఖైరతాబాద్ భారీ వినాయకుడి నిమజ్జన కార్యక్రమం పూర్తి కానున్నట్టు అధికారులు తెలిపారు. ఖైరతా బాద్ వినాయకుడిని దర్శించుకోవడానికి భారీగా తరలివస్తోన్న భక్తులు.. సెక్రటేరియట్ నుంచి ట్యాంక్ బండ్ వైపు మెల్లగా కదులుతున్న గణనాయకుడు.
Balapur Laddu Auction: ప్రతి ఏటా పెరుగుతూ వెళ్తున్న బాలాపూర్ లడ్డు వేలం పాట ఈ సారి ఎంతవరకు వెళ్తుందనేదానిపై ఉత్కంట నెలకొంది. గతేడాది 30 లక్షల ఒక వెయ్యి రూపాయలకు బీజేపీ నేత కొలన్ శంకర్ రెడ్డి ఈ లడ్డూు దక్కించుకున్నారు. ఆ తర్వాత ఆయన దాన్ని ప్రధాన మంత్రికి ఇతర కేంద్ర మంత్రులకు పంచారు. అయితే గతఏడాది లడ్డూ వేలంలో పాల్గొనే వారితో పాటు.. కొత్తగా ఏనిమిది మంది ఈ వేలంలో పాల్గొన్నారు. బాలాపూర్ లడ్డూను రూ. 35 లక్షలకు దక్కించుకున్న లింగాల దశరథ్ గౌడ్. ఈ సారి 4 లక్షల 99 వేల కంటే అధిక ధరకు అమ్ముడు పోవడం విశేషం.
బాలాపూర్ లడ్డూను రూ. 35 లక్షలకు దక్కించుకున్న లింగాల దశరథ్ గౌడ్.. మరిన్న వివరాల కోసం క్లిక్ చేస్తూనే ఉండండి..
హైదరాబాద్ లో ఖైరతాబాద్ అతిపెద్ద వినాయకుడు తర్వాత లడ్డూ వేలంలో ప్రాచుర్యం పొందిన బాలాపూర్ లడ్డూ వేలం ప్రారంభమైంది. భక్తులు ఎంతో ఉత్సహాంగా పాల్గొంటున్నారు.
సెక్రటేరియేట్ సమీపానికి చేరుకున్న ఖైరతాబాద్ భారీ గణ నాయకుడు.. తండోపతండాలుగా తరలివస్తోన్న భక్త జనం.. ట్యాంక్ బండ్ కు చేరుకుంటున్న భక్లులు..
Khairatabad Ganesh Shobha Yatra 2025 Live Updates: నిమజ్జనం సజావుగా సాగేలా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చెందిన జీహెచ్ఎంసీ.
– పోలీస్ , ఇతర ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ నిమజ్జనం సాఫీగా జరిగేలా చూస్తున్న జీహెచ్ఎంసీ
– నిమజ్జన పాయింట్ ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా DRF సిబ్బంది, గత ఈతగాళ్ల తో నిరంతరం నిఘా
– నిమజ్జన కార్యక్రమంలో స్వచ్ఛతకు జీహెచ్ఎంసీ ప్రాధాన్యం.
– 15 వేల మంది సానిటేషన్ సిబ్బందితో 24×7 పారిశుద్ధ్య కార్యక్రమాలు.
– గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా కోనసాగుతున్న వినాయకుల నిమజ్జన శోభాయాత్ర
#HYDTPinfo
? Khairatabad Bada Ganesh Ji Shobha Yatra passing Ram Reddy Chicken centre towards Rajdooth.#GaneshVisarjan2025 #KhairatabadBadaGanesh #GaneshImmersion pic.twitter.com/q2kE0xc5Cf— Hyderabad Traffic Police (@HYDTP) September 6, 2025
Ganesh Idols Immersion Live Updates: సరూర్ నగర్ చెరువు వద్ద యువకుల ఆందోళన.. క్రేన్ సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు
క్రేన్ సిబ్బంది వినాయకుని నిమజ్జనం చేసే ప్రయత్నంలో ఒక్కసారిగా కింద పడ్డ వినాయకుడు
వినాయక నిమజ్జనాలకు ప్రభుత్వం సరైన ఏర్పాటు చేయలేదని ఆందోళనకు దిగిన యువకులు
భారీగా మోహరించిన పోలీసులు
Balapur Ganesh Laddu Acution Live Updates: ప్రతి ఏటా పెరుగుతూ వెళ్తున్న బాలాపూర్ లడ్డు వేలం పాట ఈ సారి ఎంతవరకు వెళ్తుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. గత సంవత్సరం 30 లక్షల ఒక వెయ్యి రూపాయలకు కొలన్ శంకర్ రెడ్డి దక్కించుకున్నారు. అయితే గతఏడాది లడ్డూ వేలంలో పాల్గొనే వారితో పాటు కొత్తగా ఏనిమిది మంది పాల్గొంటున్నారు.
Balapur Ganesh Laddu Acution Live Updates: బాలాపూర్ లడ్డు వేలం పాటకి సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో బొజ్జగణపయ్య లడ్డూ వేలం ప్రారంభంకానుంది. ఈసారి బాలాపూర్ లడ్డు ఎవరు దక్కించుకుంటారు అనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఉదయం ఐదు గంటలకు బాలాపూర్ గణేశుడుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు నిర్వాహకులు. అనంతరం స్వామివారిని గ్రామంలో ఊరేగింపుగా తీసుకెత్తున్నారు ఉత్సవ సమితి సభ్యులు. తిరిగి గ్రామ బొడ్రాయికి వచ్చిన తర్వాత వేలం పాట మొదలుపెడతారు.
Ganesh Idols Immersion Live Updates: ఏపీలోని ఏలూరు జిల్లా కైకలూరులో వినాయక చవితి ఊరేగింపులో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ
==> రాళ్లు కర్రలతో ఇరుపక్షాల దాడి
==> గత మూడు రోజుల క్రితం విగ్రహాల ఊరేగింపు జరుగుతుండగా.. దారి విషయమై జరిగిన గొడవ నేపథ్యంలో ఒక వర్గం వారిపై దాడి చేసిన మరో వర్గం
==> నేడు విగ్రహ ఊరేగింపులో గత మూడు రోజుల క్రితం జరిగిన ఊరేగింపులో దాడి చేసిన వర్గంపై మరో వర్గం దాడి
==> ఇరు వర్గాల రాళ్లు, కర్రలు పరస్పర దాడితో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి
==> సమాచారం అందుకున్న పోలీసులు ఇది వర్గాలను చదరగొట్టి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు
Ganesh Laddu Auction 2025 Live Updates: హైదరాబాద్లో గణపతి లడ్డూ వేలంలో రికార్డ్ సృష్టించింది. రాజేంద్రనగర్ సన్ సిటీలోని రిచ్మండ్ విల్లాలో ఏకంగా 2 కోట్ల 32 లక్షలు పలికింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Khairatabad Ganesh Shoba Yatra 2025 Live Updates: ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర..
శోభాయాత్ర లో భారీగా పాల్గొన్న భక్తులు..
#HYDTPinfo
? Khairatabad Bada Ganesh Ji Shobha Yatra begins!
The grand immersion procession of the Khairatabad Bada Ganesh ji has started from Khairatabad Mandapam towards Hussain Sagar.
Devotees line the streets with chants and devotion. ???? #GaneshVisarjan2025… pic.twitter.com/PZMVDj9Ng7
— Hyderabad Traffic Police (@HYDTP) September 6, 2025
Khairatabad Ganesh 2025 Live Updates: హైదరాబాద్లో నేడు భారీ గణనాథుల నిమజ్జనం జరగనుంది. ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర కనులపండవగా జరుగుతోంది. విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనం ఇవ్వగా.. 69 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ శోభాయాత్రను వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు రానుండగా.. పోలీసులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గణనాథుడి శోభాయాత్ర ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వరకు హుస్సేన్ సాగర్ చేరుకునేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే వేలాది విగ్రహాలు ట్యాంక్బండ్కు క్యూకట్టగా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కొలనుల్లో వినాయకుడిన గంగమ్మ ఒడికి చేర్చనున్నారు. ఇక బాలాపూర్ లడ్డూ వేలంపాట కోసం అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర, బాలాపూర్ లడ్డూ వేలం లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.