TS Eamcet Result 2025 LIVE Updates: తెలంగాణ ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎప్సెట్ రిజల్ట్స్ నేడు వెల్లడికానున్నాయి. ఆదివారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్రెడ్డి ఫలితాలను ప్రకటించనున్నారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో ఎప్సెట్ అగ్రికల్చర్ విభాగానికి పరీక్షలు నిర్వహించగా.. 81,198 మంది విద్యార్థులు హాజరయ్యారు. మే 2, 3, 4 తేదీల్లో నిర్వహించిన ఇంజినీరింగ్ విభాగం పరీక్షలును 2,07,190 మంది రాశారు. TG EAPCET 2025 Results కోసం విద్యార్థులు https://eapcet.tgche.ac.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. అదేవిధంగా దరఖాస్తు సమయంలో రిజస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్ కూడా ఫలితాలు నేరుగా రానున్నాయి. మార్కులు, ర్యాంక్ మెసేజ్ రూపంలో వస్తాయి. తొలిసారి జేఎన్టీయూ అధికారులు ఇలా మొబైల్కు ఫలితాలను పంపిస్తున్నారు. TS EAPCET 2025 Results లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.









