Telangana SSC Advanced Supplementary Examinations 2025: పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్. పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో ఫెయిలయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించగా తాజాగా వాటికి సంబంధించిన ఫలితాలను శుక్రవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. మార్చిలో జరిగిన పరీక్షలకు సంబంధించిన ఫలితాలు ఏప్రిల్ 30వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో ఉత్తీర్ణత శాతం 92.78 నమోదైంది. జూన్ 3 నుంచి జూన్ 13వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. వాటికి సంబంధించి సెకండరీ విద్యా శాఖ అధికారులు వాల్యుయేషన్ పూర్తి చేశారు. కొన్ని నిమిషాల్లో అధికారులు పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.









