తెలంగాణలో కమలం పార్టీ వికాసం ; నాల్గు స్థానాల్లో...

అందరినీ ఆశ్చర్యపరుస్తూ తెలంగాణలో ఏకంగా నాల్గు స్థానాల్లో కమలం పార్టీ ఆధిక్యాన్ని  కొనసాగిస్తోంది. 

Last Updated : May 23, 2019, 01:13 PM IST
తెలంగాణలో కమలం పార్టీ వికాసం ; నాల్గు స్థానాల్లో...

దేశ వ్యాప్తంగా మోడీ జోరు కొనసాగుతోంది. ఎవరూ ఊహించని రీలితో తెలంగాణలో కూడా కమలం పార్టీ సత్తా చాటుతోంది.  అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఏకంగా నాల్గు స్థానాల్లో ఆధిక్యం కొనసాగిస్తోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ లో దూసుకుపోతోంది.

 సికింద్రాబాద్ లో బీజేపీ అభ్యర్ధి కిషన్ రెడ్డి 35 వేల ఓట్ల మెజారిటీతో విజయం దిశగా సాగుతున్నారు. ఆదిలాబాద్ లో బీజేపీ అభ్యర్థి సోయం బాబూరావు 37 వేల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. కరీంనగర్ లో బీజేపీ నేత బండి సంజయ్ 9 రౌండ్లు ముగిసేసరికి 58 వేల ఓట్ల మెజారిటీ సాధించారు.

ఇక కేటీఆర్ కుమార్తె బరిలో ఉన్న నిజామాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ 16 వేల ఆధిక్యంలో ఉన్నారు. ఓవర్ ఆల్ గా చూసినట్లయితే తెలంగాణలో ప్రస్తుతం 9 చోట్ల టీఆర్ఎస్ లీడింగ్ లో ఉండగా, కాంగ్రెస్ 3, బీజేపీ 4, మజ్లిస్ పార్టీ ఓ స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
 

Trending News