)
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులు కకావికలం అయ్యారు. ఇప్పటికే హిడ్మా వంటి నేతలు పోలీసులు ఎదురు కాల్పుల్లో మృతి చెందారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు కేంద్రం తో పాటు భద్రతా బలగాల ఉచ్చులో చచ్చే కంటే లొంగిపోవడమే మేలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే పెరిగిన టెక్నాలజీ వల్ల మావోయిస్టుల అనుపానులు పట్టుకోవడం కష్టమని చెబుతున్నారు. ఈ క్రమంలో 37 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోవాలని నిర్ణయించారు. మావోయిస్టు అగ్రనేతలు ఆజాద్, అప్పాసినాయుడు, ఎర్రా ఉన్నట్లు సమాచారం.
ఆపరేషన్ కగార్.. టార్గెట్ రీచ్ అవుతోంది. డండకారణ్యం వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు మావోయిస్టులు ముందుకొస్తున్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల పిలుపుతో మావోయిస్టు అగ్రనేతలు ఒక్కొక్కరుగా భయంతో ఒణికిపోతున్నారు. దీంతో ఆయుధాలు వీడి జన జీవన స్రవంతిలో కలవాలనే నిర్ణయం తీసుకున్నారు. ః
ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు మావోయిస్టులను కలవరపెట్టాయి. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్ కౌంటర్ సంచలనం రేకెత్తించింది. తనే స్వయంగా లొంగిపోయేందుకు ప్రయత్నిస్తున్న ప్రయత్నంలో ఎన్ కౌంటర్ చర్చనీయాంశమైంది. మరుసటి రోజే మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఎన్ కౌంటర్లో చనిపోయేకంటే.. ప్రభుత్వం ముందు లొంగిపోవడం ఉత్తమమని భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.