)
Ponnam Prabhakar mass warning to private travel owners: ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ లో జరిగిన బస్సు ప్రమాదం యావత్ దేశాన్ని కంట తడి పెట్టించేదిగా మారింది. ఈ క్రమంలో బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మంది సజీవ దహనం అయ్యారు. కావేరీ ట్రావెల్స్ చెందిన బస్సు ఒక బైకర్ ను ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కర్నూల్ లోని కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
బస్సు ప్రమాదం జరిగినప్పుుడు దానిలో 44 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే.. ప్రమాదం ఘటనపై అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో తెలంగాణ ట్రాన్స్ పోర్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ కర్నూల్ బస్సు ఘటనపై భావోద్వేగానికి గురయ్యారు. అదే సమయంలో ముందస్తు జాగ్రత్తగా.. తెలంగాణ ప్రైవేటు ట్రావెల్స్ ఓనర్స్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
ప్రైవేట్ ట్రావెల్స్ యజమానుల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికుల ప్రాణాలు పోతే, ఇకపై వారిపై హత్యా నేరం కింద కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతామని హెచ్చరించారు. ప్రయాణికుల జీవితాలతో చెలగాటం ఆడతామంటూ వదిలేదిలేదని స్పష్టం చేశారు.
బస్సుల ఫిట్నెస్, ఇన్సురెన్స్, స్పీడ్ నిబంధనల విషయంలో ఎక్కడ కూడా పొరపాట్లకు, నెగ్లీజెన్సీలకు తావులేకుండా చూడాలన్నారు.
మరోవైపు ప్రమాదానికి గురైన బస్సు ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. ప్రైవేట్ బస్సుల మితిమీరిన వేగాన్ని నియంత్రించేందుకు త్వరలోనే ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా, పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రవాణా శాఖ మంత్రులతో సమావేశం నిర్వహించి, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో భద్రతా ప్రమాణాలపై చర్చిస్తామని తెలిపారు.
ఇక నుంచి ప్రైవేటు బస్సు ఆగడాలను ఎట్టిపరిస్థితుల్లో సహించేదిలేదని స్పష్టం చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ వ్యవస్థను నియంత్రించి, ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించడమే తమ సర్కారు లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook