
Minister Seethakka fires on brs ktr and clarity on local body elections: తెలంగాణలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల రచ్చ నెలకొంది. ఈ క్రమంలో ఇటీవల దీనిపై మంత్రి పొంగులేటీ, మంత్రి తుమ్మలతోపాటు, సీతక్క కూడా మాట్లాడటం పెద్ద దుమారంగా మారింది. ఈ క్రమంలో ఇటీవల మంత్రి సీతక్క స్థానిక సంస్థల ఎన్నికలపై మాట్లాడిన మాటలు రచ్చకు దారితీశాయి.
దీనిపై ఏకంగా మంత్రి సీతక్క రంగంలోకి దిగి మరీ క్లారిటీ ఇచ్చుకున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క.. హైదరాబాదులోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఇటీవల పంచాయతీ ఎన్నికలపై చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.
స్థానిక సంస్థ ల ఎన్నికలు త్వరలో ఉంటాయని మాత్రమే తాను మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు. కానీ షెడ్యూల్, నెల తో సహా చెప్పినట్లుకొన్ని మీడియా లో ప్రచారం జరిగింది.. అది అవాస్తవమన్నారు. మీడియా సంస్థలు వాస్తవాలు తెలుసుకుని వార్తలు వేయాలని మండిపడ్డారు. తాను ఒక మంత్రి హోదాలో ఉన్నానని.. అనని మాటలు అన్నట్లు గా వార్తలు నడపడం ఎంత వరకు సమంజసం అన్నారు. ఈ ఘటన ఎంతో మనో వేదనకు గురిచేసిందన్నారు.
కార్యకర్తల సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై వారం పది రోజుల్లో స్పష్టత వస్తుందని మాత్రమే చెప్పినట్లు క్లారిటీ ఇచ్చారు. కానీ కొన్ని మీడియా సంస్థలు.. వారం రోజుల్లో షెడ్యూల్ వస్తుందని, నోటిఫికేషన్ వెలబడుతుంది అన్నట్టుగా తన మాటల్ని పూర్తిగా వక్రీకరించాయన్నారు. తాను అలా మాట్లాడినట్లు.. ఒక్క ఆధారం అయిన చూపిస్తారా?.. అంటూ సవాల్ విసిరారు.
తాను.. 20 సంవత్సరాలుగా ప్రజా సేవలో ఉన్నాను.. లోకల్ ఎన్నికలు ఎలా జరుగుతాయో నాకు తెలియదా అన్నారు. క్యాబినెట్లో చర్చించిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం ద్వారా సామాజిక న్యాయం సాకారం అవుతుందన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశలో అసెంబ్లీలో బిల్లు పాస్ చేశామని గుర్తు చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఎన్నికలు ఆలస్యం అయ్యాయన్నారు. కేంద్రం నుంచి నిధులు రాకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. 42 శాతం రిజర్వేషన్ల అంశం కేంద్రం చేతిలో ఉంది.. అలాంటప్పుడు 42% రిజర్వేషన్లు ఎలా కల్పించాలన్న దానిపై చర్చిస్తామన్నారు.
పదేళ్లు అధికారంలో ఉండి అట్టడుగు వర్గాలను అనగదొక్కిన గులాబీ పార్టీ.. ఇప్పుడు బీసీలకు 42 శాతం అని కూని రాగాలు తీస్తోందని సీతక్క ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని సీతక్క అన్నారు. అదే విధంగా కేటీఆర్ ను ఈ కారు రేసింగ్ కేసులో ఏసీబీ విచారణపై సీతక్క మాట్లాడారు. కేటీఆర్ జైలు కు పోవాలని కుతూహలంగా ఉన్నారని పంచ్ లు వేశారు.
వీలైనంత త్వరగా జైలు కు పంపించాలని మా సీఎం ను రెచ్చగొడుతున్నారని మాట్లాడారు.. కేటీఆర్, కవిత మధ్య పోటీ ఉందని, కవిత జైలు కు పోయివచ్చి బీసీ ఎజెండా ఎత్తుకుంది.. నేను వెనకబడ్డా అని కేటీఆర్ కూడా జైలు కు పోయి పథకం రచించాలనుకుంటుంన్నాడని సీతక్క సెటైర్ లు వేశారు. కేటీఆర్ పొగరు తో మాట్లాడుతున్నాడు.
ఏదో ఆశించి కేటీఆర్ జైలు కు పోవాలనుకుంటున్నాడు. తోడేళ్ళ లా దొచుకుని... ఇప్పుడు కొంగ వినయం ప్రదర్శిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. కేటీఆర్ పొగరు తో మాట్లాడుతున్నాడు ...మా సీఎం పౌరుషం తో మాట్లాడుతున్నాడని.. కేటీఆర్ వ్యవహరాన్ని దర్యాప్తు సంస్థ లే చూసుకుంటాయని మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook.