Minor girl molested in running train near secunderabad: తెలంగాణలో మహిళలు, అమ్మాయిల భద్రత గాల్లో దీపంలో మారిందని చెప్పుకొవచ్చు. బస్టాండ్, రైల్వేస్టేషన్, మెట్రోలు, ఇలా ప్రతిచోట అమ్మాయిలు వేధింపులకు గురౌతున్నారు. ప్రతిరోజు కూడా అత్యాచారాలకు చెందిన ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. పోలీసులు ఎంత సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్న, ఎన్ని కఠిన చట్టాల కింద కేసుల్ని నమోదు చేసిన కూడా కామాంధులు మాత్రం తమ వంకర బుద్దిని మార్చుకొవడంలేదు.
ఈ క్రమంలో ఇటీవల సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఏపీకి చెందిన యువతిపై ఒక కేటుగాడు ఎంఎంటీఎస్ ట్రైన్ లో అఘాయిత్యానికి ప్రయత్నించాడు. ఈ ఘటన పెనుదుమాంగా మారింది. దీనిపై అన్ని పార్టీలు సైతం తీవ్రంగా స్పందించాయి. రైల్వే పోలీసులు సైతం.. దీనిపై సీరియస్ అయ్యారు.మరోసారి ఇలాంటి ఘటనలు జరక్కుండా చూస్తామని హమీ సైతం ఇచ్చారు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ఒరిస్సాకు చెందిన ఒక కుటుంబం రక్సెల్- సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్నారు. రాత్రి 2గంటల ప్రాంతంలో మైనర్ బాలిక వాష్ రూమ్ కు వెళ్లింది.అక్కడున్న ఒక కామాంధుడు బాలికను అటకాయించి వాష్ రూమ్ లో బాలికను బంధించి.. అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
Read more: Holidays 2025-26: దసరా, సంక్రాంతి సెలవుల జాబితా వచ్చేసింది.. అకాడమిక్ క్యాలెండర్ హాలిడే డేట్స్..
అంతే కాకుండా.. ఈ నీచపు పనుల్ని తన ఫోన్ లో రికార్డు కూడా చేసుకున్నాడు. వెంటనే బాలిక తన వాళ్లకుచెప్పడంతో.. దుర్మార్గుడ్ని.. బాలిక కుటుంబ సభ్యులు, అక్కడున్న వారి సాయంతో పట్టుకున్నారు. వెంటనే ట్రైన్ సికింద్రాబాద్ కు చేరుకొగానే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. బాధిత తండ్రి.. పలు వీడియోలను జీఆర్పీ పోలీసులకు చూపించాడు. ఈక్రమంలో పోలీసుల కామాంధుడి మీద పోక్సో ప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటన మరోసారి సికింద్రాబాద్ పరిధిలో సంచలనంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









