
Miss World 2025: ప్రకృతి.. పర్యాటకం.. జీవవైవిధ్యం కలిగిన తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలతో తెలంగాణ కీర్తి ప్రతిష్టలే కాకుండా హైదరాబాద్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందనుంది. హైదరాబాద్ కీర్తిని పెంచే మిస్ వరల్డ్ పోటీలకు 120 దేశాల నుంచి మోడల్స్ తళుక్కుమననున్నారు. పోటీల్లో భాగంగా చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్, చౌమొహల్ల ప్యాలెస్లో స్వాగత వింద్ (వెల్కమ్ డిన్నర్) నిర్వహించనున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
తెలంగాణ పర్యాటక గుర్తింపు పెరిగేలా.. తెలంగాణ అతిథ్యానికి వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు ఉండాలని తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మిత సబర్వాల్ అధికారులకు ఆదేశించారు. మిస్ వరల్డ్ ఏర్పాట్లపై మంగళవారం టూరిజం, జీహెచ్ఎంసీ, హెరిటేజ్, పోలీస్ ఆఫీసర్లతో చౌమహల్లా ప్యాలెస్లో అధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం అధికారులతో స్మిత సబర్వాల్ సమీక్ష నిర్వహించారు. మే 7 నుంచి 31వ తేదీ వరకు 72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగునుండడంతో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ పోటీలలో 120 దేశాలకు చెందిన మోడల్స్ పాల్గొననుండగా మే 6, 7వ తేదీన హైదరాబాద్ చేరుకుంటారు. వారి రాక సందర్భంగా చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్, చౌమహల్లా ప్యాలెస్లో స్వాగత విందు (వెల్కమ్ డిన్నర్) ఉండనుంది.
వెల్కమ్ డిన్నర్లో తెలంగాణ టూరిజం బ్రాండ్ ఇమేజ్ అనుగుణంగా ఏర్పాట్లను చేయాలని పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ అధికారులకు ఆదేశించారు. 120 మంది మోడల్స్తో పాటు సుమారు 400 మంది ప్రతినిధులు, ఫొటోగ్రాఫర్లు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు పాల్గొననున్నారని వివరించారు. ఈవెంట్ ప్రారంభం నుంచి చివరి వరకు పర్యాటక ప్రత్యేకతలు చాటేలా కార్యక్రమాలు రూపొందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
విందు, వినోదం ఇలా..
చౌమహల్లా ప్యాలెస్లో ఫొటోషూట్ కోసం సీటింగ్ ఏర్పాట్లు, లైవ్ మ్యూజిక్ కాంటెస్ట్, సూఫీ మ్యూజిక్, ఖవ్వాలీ సంగీత ప్రదర్శన, తెలంగాణ సంస్కృతీసాంప్రదాయాలు ఉట్టిపడేలా 20 నిమిషాలపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా కార్యక్రమాన్ని రూపొందించాలని అధికారులకు నిర్దేశించారు. వెల్కం డిన్నర్లో నిజాం వంటకాలు, తెలంగాణ రుచులు మెనూలో ఉండేలా చూడాలని పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఆదేశించారు. ఈ సమీక్షలో పర్యాటక శాఖ డైరెక్టర్ హనుమంతు, డైరెక్టర్ యూత్ సర్వీసెస్ డా. వాసం వెంకటేశ్వర్ రెడ్డి, శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు, సెట్విన్ ఎండి వేణుగోపాల్, టూరిజం, పోలీస్, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe