
MLA Komatireddy Raj Gopal Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచోడు కాబట్టి మీరు 15 నెలల నుంచి ప్రశాంతంగా పడుకున్నారని.. లేకపోతే నిన్నటి వరకు ఒక లెక్క.. రేపటి నుంచి ఇంకో లెక్క మాదిరి ఉంటుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వాళ్లు చేసిన నిర్వాకం గురించి పదేపదే చెప్పాలని తమకు కూడా లేదని.. నిర్వాకం చేసి నిర్ణయాలు తీసుకున్నాయన సభకు రావడం లేదన్నారు. విలన్ను పట్టుకుని ఎన్నిసార్లు అనాలని తమకే విసుగొస్తుందన్నారు. రాష్ట్ర పునర్విభజనలో భాగంగా తెలంగాణ ప్రాంతానికి 4000 మెగావాట్ల సామర్థ్యంతో ఎన్టీపీసీ కేంద్ర నిర్మిస్తామన్నా.. బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించలేదన్నారు. అత్యధిక వడ్డీ రేటుకు డబ్బులు తీసుకొచ్చి సింగరేణి గనుల నుంచి 280 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిర్యాలగూడ వద్ద విద్యుత్ కేంద్రం నిర్మించారని విమర్శించారు.
"కాంగ్రెస్ అంటేనే కరెంట్.. కరెంట్ అంటేనే కాంగ్రెస్.. రైతుల గురించి వ్యవసాయం ఉచిత కరెంట్ తీసుకువచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ప్రతిపక్షం లేకుండా చేసి ఈరోజు అక్కడ కూర్చుని మీరు మాకు నీతులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నాయకత్వంలో గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దడమే కాకుండా రాబోయే కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంస్కరణలు తీసుకువస్తున్నాం. మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పజేబితే.. బ్రహ్మాండంగా పనిచేయాల్సింది పోయి ఆలోచన చేయకుండా ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని అప్పలపాలు చేశారు. మేం మంచి పనులు చేస్తుంటే ప్రస్టేషన్కు గురవుతున్నారు.
మా మంత్రులు ముఖ్యమంత్రి ఓపికతో సమాధానం చెబుతున్నారు. ఏ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ దాచిపెట్టేది లేదు. ఆర్థిక విషయాలైనా కరెంట్ విషయాలైనా ప్రజలకు తెలిపాల్సిన బాధ్యత మాపై ఉంది. బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడే పద్ధతి, విమర్శించే పద్ధతి, అవసరం ఉన్నా లేకున్నా బైకాట్ చేసే పద్ధతి చూశాక ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా చేస్తున్నారు. మీరంటే ప్రతిపక్షం లేకుండా చేశారు. మేము ఆ పని చేయడం లేదు. ప్రజలే మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్తున్నారు. ఎందుకంటే మీ నాయకుడు లేడు. ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే ఆలోచన మీకు లేదు.
మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచోడు కాబట్టి మీరు 15 నెలల నుంచి ప్రశాంతంగా పడుకున్నారు. లేకపోతే నిన్నటి వరకు ఒక లెక్క రేపటి నుంచి ఇంకో లెక్క ఉంటది గుర్తుపెట్టుకోండి. మీరు చేసిన పాపాలు కడగాలంటే ఎవరో దేవుడు వస్తారు. తొందరపడకండి. 2014 నుంచి 2024 వరకు మీరు మీ ప్రభుత్వ హయాంలో పోలీసులను, అధికారులను అడ్డం పెట్టుకొని ఏ రకంగా అరాచకం సృష్టించారో మాకు తెలుసు. అదే ఈ 15 నెలల కాలంలో మీరు ఎంత రెచ్చగొట్టినా మీ ట్రాప్లో పడకుండా ఎంతో ప్రశాంత వాతావరణం నిలబెడుతున్నాం. " అని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe