)
Kaleshwaram Project: తన తండ్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై సీబీఐ విచారణకు ఆదేశించడంపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన రేవంత్ రెడ్డి స్వరాష్ట్రం సాధించిన కేసీఆర్పై సీబీఐ విచారణకు ఆదేశించడం సిగ్గు అని ప్రకటించారు. 'మా నాన్నపై సీబీఐ విచారణ వేశారు.. కడుపు రగిలిపోతోంది. తరతరాలకు తరగని ఆస్తిని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. కేసీఆర్కు తిండిమీద డబ్బుమీద యావ ఉండదు' అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
విదేశాల నుంచి హైదరాబాద్ చేరుకున్న ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో సోమవారం కీలక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'కేసీఆర్ పక్కన ఉన్నవాళ్లలో కొందరి వల్ల ఇలా జరిగింది. ఇదంతా హరీశ్ రావు వల్లనే జరిగింది' అని ఆరోపించారు. 'కాంగ్రెస్ ప్రభుత్వం అనుక్షణం కేసీఆర్ జపం చేస్తోంది. వరదలు వస్తే ఆదుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. మేము ఎంపీలుగా ఉన్నప్పుడు ఆరు నెలల ముందు యూరియా కోసం కేసీఆర్ మమ్మల్ని అలెర్ట్ చేసేవారు' అని కవిత తెలిపారు.
'కాళేశ్వరంలాంటి తరగని ఆస్తిలో మేడిగడ్డ అనేది చిన్న భాగం. కేసీఆర్ తెలంగాణకు నీళ్లు తేవడం కోసం ఆరు, ఏడు నెలలు పరిశోధన చేశారు. కేసీఆర్కు తిండి ధ్యాస, డబ్బు ధ్యాస ఉండదు. కేసీఆర్పై ఆబండాలు వేస్తున్నారు. కాలేశ్వరం ప్రాజెక్టును 200 ఏళ్లు ప్రజలు గుర్తు ఉంచుకుంటున్నారు. కేసీఆర్కు అవినీతి మరక ఎట్లా వచ్చింది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆలోచించాలి. కేసీఆర్ పక్కన ఉన్న వారితో అవినీతి మరక అంటింది. కేసీఆర్కు అవినీతి మరక అంటించడంలో హరీశ్ రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్, మేఘా కృష్ణారెడ్డి పాత్ర ఉంది' అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు.
'కేసీఆర్ను నేడు రేవంత్ రెడ్డి విమర్శించే పరిస్థితి వచ్చింది. దగ్గర ఉండి అవినీతి అనకొండలు కేసీఆర్ను బద్నాం చేస్తున్నారు. నా వెనుక బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. నాది కేసీఆర్ బ్లడ్. నేను స్వతంత్రంగా ఉంటా. కేసీఆర్ లాంటి మహానేతపై సీబీఐ విచారణ చేసే పరిస్థితి వచ్చింది' అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తనపై సోషల్ మీడియాలో
ట్రోల్ చేస్తే మీ తోలు తీస్తానని హెచ్చరించారు.
'కాంగ్రెస్ ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ పేరుతో టైం పాస్ చేస్తోంది. రేవంత్ రెడ్డికి కేసీఆర్ పెరు చెప్పకపోతే పేపర్లో ఫొటో రాదు. నేను డైరెక్ట్గా పేర్లు చెప్పిన వారిపై విచారణ చేయండి. మీకు, మీకు ఒప్పందాలు ఉన్నాయి. బిహార్ ఎన్నికల కోసం తెలంగాణ బీసీలను బలి చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లడం లేదు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేము బీహార్ వెళ్లి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం. సీబీఐ విచారణలో కేసీఆర్ కడిగినముత్యంలా బయటకు వస్తారు' అని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.