)
Jubilee Hills Elections: తెలంగాణను కల్వకుంట్ల ఫ్యామిలీ పాలిటిక్స్ షేక్ చేస్తున్నాయి. కవితను పార్టీలో నుంచి సస్పెండ్ చేయడంతో.. ఈ వార్ మరింత హీటెక్కింది. తనను పార్టీలో నుంచి సస్పెండ్ చేయడాన్ని సీరియస్ గా తీసుకున్న కవిత.. బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి రావడానికి మాజీమంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావే కారణమంటూ బాంబ్ పేల్చారు. అసలు కాళేశ్వరంలో అవినీతికి హరీశ్ రావే కారణమంటూ ఘాటు విమర్శలు చేశారు. ఈ చర్యతో కవితను పార్టీలో నుంచి బీఆర్ఎస్ గెంటేశారు. దాంతో మరోసారి బయటకు వచ్చిన కవిత.. హరీశ్ రావు, సంతోష్ రావును మళ్లీ టార్గెట్ చేశారు.. అంతేకాదు.. వారిపై సంచలన ఆరోపణలు చేస్తూనే.. కేసీఆర్, కేటీఆర్ అప్రమత్తంగా ఉండాలని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. దాంతో ఇకమీదట కవిత ఏం చేయబోతుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఆలోపే బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ ఇచ్చేందుకు కవిత రెడీ అవుతున్నట్టు ప్రచారం సాగుతోంది.
త్వరలోనే జూబ్లీహిల్స్ లో బైపోల్ జరగబోతోంది. అక్కడ గెలిచేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, అటు బీజేపీ పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. జూబ్లీహిల్స్లో సిట్టింగ్ సీటును నిలుపుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. అయితే జూబ్లీహిల్స్లో గెలిచి.. బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలని అధికార పార్టీ లెక్కలు వేసుకుంటోంది. ఇప్పటికే నియోజకవర్గంలో మంత్రులు సుడిగాలి పర్యటనలు చేస్తూ.. అభివృద్దిని పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ బాధ్యతలను కొందరు మంత్రులకు సైతం అప్పగించేశారు. అటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా జూబ్లీహిల్స్లో వరుస పర్యటనలతో ఎన్నికల హీట్ పెంచేశారు.
మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా మాగంటి గోపినాథ్ ఫ్యామిలీ మెంబర్ కు టికెట్ ఇచ్చేసి.. సెంటిమెంట్ ను వర్కవుట్ చేసుకునే పనిలో బిజీబిజీగా ఉంది.. అయితే ఇప్పుడు గులాబీ పార్టీకి షాక్ ఇచ్చేందుకు ఎమ్మెల్సీ కవిత రెడీ అయ్యారని తెలుస్తోంది. పార్టీలో నుంచి సస్పెండ్ అయ్యాక.. జూబ్లీహిల్స్ బరిలో తెలంగాణ జాగృతి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే కోణంలో సమాలోచనలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది..
ఇక బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక.. కవిత కొత్త పార్టీ పెడుతారని ప్రచారం సాగుతోంది. కవిత కొత్త పార్టీపై రకరకాల పేర్లు సైతం వినిపిస్తున్నాయి. దీపావళికి కొత్త పార్టీ ప్రకటన ఉండొచ్చని అంటున్నారు. ఆలోపు జూబ్లీహిల్స్ లో పోటీకి దిగితే తనకు మరింత లాభం జరిగే అవకాశం ఉందని కవిత లెక్కలు వేసుకుంటున్నారు. జూబ్లీహిల్స్లో దాదాపు 4 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇందులో ముస్లింల ఓట్లే లక్షాన్నర దాకా ఉన్నాయి. అయితే జూబ్లీహిల్స్ పేరుకే క్లాస్ నియోజకవర్గం కానీ.. అక్కడ మాస్ ఓటర్ల శాతమే ఎక్కువ. ఇప్పటికే కవితకు మాస్ పబ్లిక్లో మంచి పాపులారిటీ ఉంది.
గతంలో కవిత బతుకమ్మ, తెలంగాణ జాగృతి పేరుతో జూబ్లీహిల్స్లో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇవన్నీ ఇప్పుడు తనకు కలిసి వస్తాయని ఆమె లెక్కలు వేసుకుంటున్నారట. గెలవడం కష్టమే కానీ.. గెలుపు ఓటములను మాత్రం తప్పక ప్రభావం చేస్తామని భావిస్తున్నారట. ఒకవేళ అదృష్టం బాగుండి గెలిస్తే మాత్రం.. తన పవరెంటో ఒక్క తెలంగాణ మాత్రమే.. దేశం మొత్తం చూస్తుందని అనుకుంటున్నారట. అందుకే కవిత జూబ్లీహిల్స్లో పోటీపై తెగ అసక్తి చూపిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది..
మొత్తంమీద కవిత జూబ్లీహిల్స్లో పోటీకి దిగితే.. గులాబీ పార్టీకి డ్యామేజ్ తప్పదనే టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ ఓటు బ్యాంకును కవిత కొల్లగొడతారని అంటున్నారు. ఒకవేళ కవిత పోటీలోకి దిగితే.. ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తారు.. కవిత ఎన్నికల బరిలో నిలబడతారా అని కేసీఆర్ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ కవితే రంగంలోకి దిగితే మాత్రం.. బీఆర్ఎస్ వర్సెస్ కవిత అన్నట్టుగా సీన్ మారే అవకాశం లేకపోలేదని అంటున్నారు. అటు కవిత పోటీకి దిగితే.. ఏం చేయాలనే దానిపై కాంగ్రెస్, బీజేపీలు కూడా ఆరా తీస్త్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీసీ నేతకు టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ రేసులో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే కవితే రంగంలోకి దిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్ధిని మార్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మొత్తంగా కవిత పోటీకి దిగితే మాత్రం.. జూబ్లీహిల్స్ బైపోల్ మరింత హీటెక్కడం ఖాయమంటున్నారు పొలిటికల్ పరిశీలకులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.