)
MLC Kavitha Letter: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బాంబ్ పేల్చారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి తనను తొలగించడంపై ఆమె తెలంగాణలోని నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు బహిరంగ లేఖ రాశారు. టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా సేవ చేసే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. TBGKS గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు శుభాకాంక్షలు తెలిపారు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీస్లో ఈ ఎన్నిక జరపడం.. తప్పా ఒప్పా అనే అంశాలను పక్కన పెడితే.. ఈ ఎన్నిక రాజకీయ కారణాలతోనే జరిగినట్లు తెలుస్తోందని ఆమె అన్నారు.
సింగరేణి బొగ్గు గని కార్మికులను ఏకతాటిపైకి తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనలో తాను మొదటి నుంచి పనిచేశానని.. 2015 ఆగస్టు 17న టీబీజీకేఎస్ జనరల్ బాడీ సమావేశంలో 1000 మందికి పైగా సభ్యుల సమక్షంలో తనను గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నట్లు గుర్తు చేశారు. టీబీజీకేఎస్లో జరిగే అన్ని నిర్ణయాలను గౌరవ అధ్యక్షురాలి హోదాలో తానే తీసుకునేలా తీర్మాణం చేశారని అన్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత సింగరేణి కార్మికుల కోసం తాను పోరాడుతుంటే తనపై కుట్రలు పన్నుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కుట్రలతో తనకు వ్యక్తిగతంగా వచ్చిన నష్టమేమి లేదన్నారు. కార్మికుల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న తనను తొలగించి వారి ఐక్యతను దెబ్బ తీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోందన్నారు.
అప్పట్లో డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చే పద్ధతిని పక్కనపెడితే.. తాను సీఎం కేసీఆర్ను ఒప్పించి తిరిగి డిపెండెంట్ ఉద్యోగాలను కారుణ్య నియామకాల పేరుతో పునరుద్దరించేలా చేశానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. దీంతో సింగరేణిలో 19,463 మంది యువతకు ఉద్యోగాలు ఇప్పించానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇంక్రిమెంట్ ఇప్పించానని అన్నారు. కార్మికుల కోసం తాను చేసి అన్ని కార్యక్రమాలను ఆమె గుర్తు చేసుకున్నారు.
బీఆర్ఎస్లో గత కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలు అందరికి తెలుసని.. పార్టీ రజతోత్సవ సభలో పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగంపై వివిధ వర్గాల ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను తాను లేఖ రూపంలో చెప్పానని కవిత అన్నారు. తాను గతంలోనూ ఇలాంటివి ఎన్నో లేఖలు రాశానని తెలిపారు. తాను గతంలో అమెరికా పర్యటనకు వెళ్లిన తరువాత కొందరు ఆ లేఖను లీక్ చేశారని.. తనపై కుట్రలకు పాల్పడుతున్న వారు ఎవరో బయటపెట్టాలని తాను కోరానని అన్నారు. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను తాను ప్రశ్నించడమే తప్పు అన్నట్లుగా తనపై కక్షగట్టారని వాపోయారు. ఆ కుట్రదారులే తనను వివిధ రూపాల్లో వేధింపులకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తాను అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో కార్మిక చట్టాలకు విరుద్ధంగా TBJKS సెంట్రల్ కమిటీ సమావేశం నిర్వహించి కొత్త గౌరవ అధ్యక్షుడిని ఎన్నుకున్నట్టుగా ప్రకటించారని మండిపడ్డారు.గౌరవ అధ్యక్షురాలి పదవిలో తాను ఉన్నా లేకున్నా ప్రతి కార్మిక కుటుంబంలో సభ్యురాలిగా ఎళ్లవేళలా కార్మికుల వెంటే ఉంటానని హామీ ఇచ్చారు. ఏ చిన్న కష్టం వచ్చిన అండగా ఉంటానని లేఖలో పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.