Pawan Kalyan Dance: ఉగ్రవాదంపై కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్పై కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ ముందు పవన్ కల్యాణ్ డ్యాన్స్లు చేసుకోవాలని సూచించారు. అంతే కానీ తమ జోలికి రావొద్దని హెచ్చరించారు. మోదీని ప్రసన్నం చేసుకునేందుకు తమ పార్టీపై పవన్ కల్యాణ్ ఇష్టారాజ్యంగా వ్యాఖ్యానించడం సరికాదని హితవు పలికారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్పై మండిపడ్డారు.
Also Read: DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్లు.. డీఏ పెంపుతోపాటు 8 భారీ కానుకలు
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ తమ పార్టీపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఎంపీ చామల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్పై ఘాటుగా విమర్శలు చేశారు. 'పవన్ కల్యాణ్ నీకు ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకోవాలి అనుకుంటే ఆయన ముందు వెళ్లి డ్యాన్స్ చేయండి. అంతే కానీ ఎవరో రాసిన స్క్రిప్ట్ను చదువుతూ 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీపైన దుష్ప్రచారం చేయడం ప్రజలు గమనించాలి' అని సూచించారు.
Also Read: KCR Meeting: 'కేసీఆర్ సభను చూసి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ లాగులు తడుపుకుంటోంది'
'పవన్ కల్యాణ్ లాంటి వాళ్లను నాయకులను చేసినందుకు ప్రజలు బాధ పడాల్సిన పరిస్థితి వచ్చింది' ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అని తెలిపారు. 'నాయకుడు అనే వాడు ఆలోచించి మాట్లాడాలి. అంతేకానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి మా కార్యకర్తల మనోభావాలు కించపరిచేలా మాట్లాడడం తగదు' అని హెచ్చరించారు. 'పవన్ కల్యాణ్ సినిమా హీరో. రియల్ హీరో కాదు' అని కాంగ్రెస్ ఎంపీ స్పష్టం చేశారు. 'పవన్ కల్యాణ్ ఇది సినిమా కాదు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడానికి. మీ మోదీ మెప్పు పొందాలనుకుంటే ఆయన గురించి 2-3 సినిమాలు తీసుకో. అంతేకానీ ఎవరు ఏది రాసిస్తే అది చదవకు' అని సూచించారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ స్థాయికి తగ్గట్టు మాట్లాడాలని ఎంపీ చామల హితవు పలికారు.
'దేశ సరిహద్దులో నుంచి వంద కిలోమీటర్ల లోపలికి చొరబడి ప్రజలను కాల్చిచంపిన నలుగురు ఉగ్రవాదులను మోదీకి పట్టుకోవడం చేతకాదు. ఉగ్రవాదులు దాడి చేసి వారం రోజులు అవుతున్నా నిందితులను పట్టుకోకపోవడం ఎవరి వైఫల్యం' అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఉగ్రదాడిపై ప్రశ్నించాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీపైన విమర్శలు మంచిది కాదని చెప్పారు. సింధు జలాలను ఆపుతున్నట్లుగా ప్రజలకు భ్రమ కల్పిస్తున్నారు అని మోదీపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి