Nalgonda court verdict on miryalaguda pranay murder case: నల్గొండ జిల్లా మిర్యాల గూడలో జరిగిన పరువు హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. 2018 లోఅమృత ప్రణయ్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి అమృత తండ్రికి ఇష్టంలేదు. దీంతో సుపారీ గ్యాంగ్ తో 2018 సెప్టెంబర్ 14న అమృత ప్రెగ్నెంట్ నేపథ్యంలో ఆస్పత్రికి చెకప్ కు వెళ్తుండగా.. సుపారీ గ్యాంగ్ దారికాచి అత్యంత క్రూరంగా ప్రణయ్ ను హత్య చేశారు.
ఈ ఘటనలో పోలీసులు 8 మందిపై కేసులను నమోదు చేశారు. ఈ పరువు హత్య అప్పట్లో పెను సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో దీనిపై పోలీసులు విచారణ జరిపారు. దాదాపు.. 1600ల పేజీల చార్జీషీట్ ను నల్గొండ కోర్టులో దాఖలు చేశారు. ఈ రోజున దీనిపై నల్గొండ ఎస్సీ, ఎస్సీ కోర్టు తుదితీర్పును వెలువరించింది.
ఈ కేసులో ఏ1గా ఉన్న మారుతీరావు... 2020 లో బెయిల్ మీద విడుదలై గతంలో సూసైడ్ చేసుకున్నారు. దాదాపుగా ఈ కేసులో ఐదేళ్లకు పైగా ఎక్కువగా విచారణ జరిగింది. నల్గొండ పోలీసులు ఈ పరువు హత్య కేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అంతేకాకుండా.. ప్రతి ఒక్క ఎవిడెన్స్ లను సేకరించి.. కోర్టులో ప్రవేశపెట్టారు.
ఈ క్రమంలో నల్గొండ కోర్టు తాజాగా... ఏ 2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. నిందితులందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఎస్సీ, ఎస్టీ సెషన్స్ రెండో అదనపు న్యాయ స్థానం తీర్పును వెల్లడించింది. ముఖ్యంగా.. 302, 120 ఐపీసీ, 109, 1989 సెక్షన్ ఐపీసీ ఇండియన్ ఇండియన్ ఆర్మ్ యాక్ట్ 1959 ప్రకారం శిక్ష విధించింది.
ప్రణయ్ పరువు హత్య కేసులో.. ఏ1 గా మారుతీరావు, ఏ2గా సుభాష్ శర్మ(బీహర్), ఏ3గా అస్గర్ అలీ, ఏ4 గా అబ్దాల్ భారీ, ఏ5 గా, అబ్దుల్ కరీం, ఏ6 గాశ్రావణ్ (మారుతీ రావు తమ్ముడు), ఏ7గా శివ (మారుతీరావు కారు డ్రైవర్), ఏ8 గా నిజాం (ఆటో డ్రైవర్)లుగా ఈ కేసులో ఉన్న నిందితులకు కోర్టు తుది శిక్షను విధించింది. ఈ క్రమంలో ఇన్నాళ్లకు ప్రణయ్ కేసులో కోర్టు తుదీ తీర్పు వెలువరించడంతో ఈ ఘటన మరోసారి వార్తలలో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









