
woman died in road accident in mulugu: దేశ మంతట కూడా రాఖీ పండగను అక్కాచెల్లెమ్మలు తమ సోదరులతో కలసి ఆనందోత్సావాల మధ్య జరుపుకుంటున్నారు.ఈ క్రమంలో రాఖీ పండగ వేళ అందరి ఇళ్లు కూడా అక్కాచెల్లెమ్మలతో రాకలతో పండగ శోభను సంతరించుకున్నాయి. అంతే కాకుండా.. దేశమంతట రోడ్లన్ని బిజీగా ఉన్నాయి. దుకాణాలన్ని కూడా కొనుగోలు దారులతో కిక్కిరిసిపోయాయి.
ఈ క్రమంలో ప్రస్తుతం రాఖీ పండగ అక్కాచెల్లెమ్మల ప్రేమానురాగాల బంధానికి గుర్తుగా జరుపుకుంటారు. అనాదీగా ఉద్యోగాల కోసం, చదువుల కోసం ఎక్కడున్న సరే.. రాఖీ రోజు తమ ఇంటికి అందరు చేరుకుంటారు. ఆ రోజంతా తమ వారితో ఎంతో సంతోషంగా గడుపుతారు.ఈ క్రమంలో ప్రస్తుతం రాఖీ వేళ ములుగు జిల్లాలో ఒక ఇంట్లో మాత్రం పెనువిషాదం సంభవించింది. ఈ ఘటన వార్తలలో నిలిచింది.
ములుగు జిల్లాలో పద్మ అనే మహిళ తన సోదరుడికి రాఖీ కడదామని తన భర్తతో కలిసి బైక్ మీద వెళ్లింది. రాఖీ కట్టింది. అక్కాతమ్ముళ్లు ఎంతో ఆనందంతో ఒకర్ని మరోకరు ప్రేమతో స్వీట్లు తిన్పించుకుని రాఖీని జరుపుకున్నారు.ఈ క్రమంలో రిటర్న్ లో మహిళ తన భర్తతో కలిసి ఇంటికి వెళ్తుండగా.. నాంపల్లి క్రాస్ వద్ద ఒక్కసారిగా రోడ్డు ప్రమాదం సంభవించింది.
సదరు మహిళ.. కుదుపులతో ఎగిరి రోడ్డు మీద పడింది. దీంతో ఆమె తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం అయి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. అప్పటిదాక.. రాఖీ కట్టి ఇంట్లో ఆనందాలు జరుపుకున్నా తమ అక్కా.. ఈ విధంగా తిరిగిరానిలోకాలకు వెళ్లిందని తెలిసి ఆ కుటుంబం గుండెలవిసేలా రోదిస్తున్నారు.
ఈ ఘటనను చూసి అక్కడి వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ కుటుంబంతో పెనువిషాద ఛాయలు అలుముకున్నాయి. మొత్తంగా పండగ పూట మాత్రం ఈ ఘటన అందర్ని కలిచివేసేదిగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook