
Saroor Nagar Apsara Case Update: హైదరాబాద్ లో సరూర్ నగర్ లో పూజారి వెంకట సాయి కృష్ణ .. అప్సరను ప్రేమ పేరుతో మోసం చేశాడు. యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను శారీరకంగా ఉపయోగించుకున్నాడు. చివరకు పెళ్లి చేసుకొమ్మని యువతి బలవంతం చేయడంతో.. సాయి కృష్ణ ఆమెను శంషాబాద్ కు తీసుకెళ్లాడు. అక్కడ హత్య చేసి.. సరూర్ నగర్ ఏరియాలో డ్రైనేజ్ లో పడేశాడు. మ్యాన్ హోల్ లో సిమెంట్ వేసి మరీ పూడ్చివేశాడు.
మిస్సింగ్ ఘటన కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి..సాయి కృష్ణ ను అదుపులోకి తీసుకుని విచారించగా... ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 2023 లో ఈ ఘటన సంచలనంగా మారింది. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. విచారణ జరిపిన రంగారెడ్డి కోర్టు సాయి కృష్ణకు జీవిత ఖైదు విధిస్తు తీర్పునిచ్చింది. అంతే కాకుండా.. రూ.10వేల జరిమానాతో పాటు సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో ఏడేళ్లు జైలు శిక్షను విధించింది.
2023 జూన్ 3న కోయంబత్తూరు వెళ్దామని అప్సరను నమ్మించి, విమాన టికెట్లు కొనుగోలు చేశానని వెంకటసాయికృష్ణ చెప్పాడు. ఆరోజు రాత్రి 8.15 గంటలకు సాయికృష్ణ, అప్సర కారులో సరూర్నగర్ నుంచి బయల్దేరారు. రాత్రి భోజనం చేసి.. ఆతర్వాత సుల్తాన్పల్లిలోని గోశాల వద్దకు వెళ్లారు. అక్కడ కొంతసేపు గడిపారు.
గోశాలలో బెల్లం దంచే రాయిని కారులో పెట్టుకుని.. యువతి నిద్రలోకి జారుకోగానే. బండారాయితో మోదీ ఆమెను హతమార్చాడు. ఆ తర్వాత యువతి మృతదేహాన్ని కవర్ లో చుట్టేసి.. మ్యాన్ హోల్ లో పడేసి.. సిమెంట్ వేసి పూడ్పించాడు. ఈ ఘటన అప్పట్లో తెలంగాణలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe