)
Hyderabad Ganesh Immersion 2025: తెలంగాణతోపాటు హైదరాబాద్లో అంగరంగ వైభవంగా.. ఎంతో భక్తిశ్రద్ధలతో వినాయక ఉత్సవాలు జరుగుతున్నాయి. వినాయక నవరాత్రి ఉత్సవాలు ఈనెల 6వ తేదీతో ముగియనున్నాయి. వినాయకుడిని ప్రతిష్టించిన భక్తులు కొందరు ఇప్పటికే నిమజ్జనాలు చేసేస్తున్నారు. అయితే ప్రధాన నిమజ్జనం అంటే మహా నిమజ్జనం శనివారం జరగనుంది. హైదరాబాద్లో ప్రధానంగా హుస్సేన్సాగర్లో వినాయక నిమజ్జనం చేస్తారు. ఇంకా నాలుగు రోజుల సమయే ఉన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం మేల్కొకపోవడంతో గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాంక్బండ్ను పరిశీలించిన ఉత్సవ కమిటీ సభ్యులు ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై ధర్నాకు దిగారు.
హైదరాబాద్ వినాయక నిమజ్జనాలపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద ఆందోళన చేపట్టారు. గణేశ్ నిమజ్జనాలకు ఇంతవరకు ట్యాంక్బండ్పై ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని.. క్రెయిన్లు ఎక్కడ? అని ప్రశ్నించారు. ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు, భక్తులు ఇబ్బందులు పడుతున్నారని కమిటీ సభ్యులు తెలిపారు.
'కోర్టు ఉత్తర్వులు ప్రకారం నడుచుకుంటామంటే నిమజ్జనాలు కష్టం. 45 ఏళ్ల నుంచి ట్యాంక్బండ్పై నిమజ్జనాలు చేస్తున్నాం. ఇప్పుడు చేయమంటే కుదరదు' అని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి స్పష్టం చేసింది. నిమజ్జనాలకు సంబంధించి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని.. లేకుంటే మండపాల నుంచి వినాయకులను తరలించమని హెచ్చరించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరుపున భక్తులతో కలిసి ఆందోళనకు దిగుతామని ప్రకటించారు. ఈ సందర్భంగా ట్యాంక్బండ్పై జాలీలను తీసేసి క్రేన్లను ఏర్పాటు చేయాలని ఆందోళన చేపట్టారు. రోడ్డుపై ఆందోళన చేస్తున్న భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులను అరెస్ట్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.