)
Revanth reddy emergency meeting with Telangana officials over heavy rains: తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జన జీవనం అంత అస్తవ్యస్తంగా మారిపోయింది. దీంతో అసలు బైటకు వెళ్లాలంటేనే జనాలు భయపడిపోతున్నారు. కుండపోతగా కురుస్తున్న వానలతో రోడ్లల్ని చెరువుల్ని తలపిస్తున్నారు. అంతే కాకుండా లోతట్టు ప్రాంతాలన్ని కూడా జలమయం అయిపోయాయి. ఈ క్రమంలో హైదరాబాద్ నగరం కూడా భారీ వర్షానికి చిగురు టాకుల వణికి పోయిందని చెప్పుకొవచ్చు.
మరోవైపు రానున్న మూడురోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో వర్షాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.. కీలక ఆదేశాలు జారీ చేశారు. రాబోయే భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని ఇంచార్జి మంత్రులు, అధికారులకు సీఎం సూచించారు.
రానున్న మూడు రోజులు అధికారులు, అన్ని శాఖలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది సెలవులు రద్దు చేయాలని కూడా సీఎం ఆదేశించారు. హైదరాబాద్ తో పాటు వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణకు లా అండ్ ఆర్డర్ పోలీసుల సేవలను వినియోగించుకోవాలని సీఎం వెల్లడించారు. అదే విధంగా ఐటీ కంపెనీలు, స్కూళ్లకు సెలవులపై కూడా అధికారులు ఆసమయంలో పరిస్థితిని బట్టి చర్యలు తీసుకొవాలన్నారు.
ఆకస్మిక వరదలు సంభవించినపుడు ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు అవసరమైన హెలికాప్టర్స్ కూడా ఉండేలా చూసుకోవాలన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలన్నారు. విద్యుత్ కు సంబంధించి అత్యవసర సమయాల్లో ఉపయోగించుకునేందుకు వీలుగా మొబైల్ ట్రాన్స్ఫర్స్ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. 24 గంటలు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.
అత్యవసర సమయాల్లో ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలన్నారు. స్కూల్స్, కాలేజీలు, ఐటీ సెక్టార్ ఉద్యోగులకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులు తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు. భారీ వర్షాల సమయంలో ప్రజలు అనవసరంగా బైటకు రాకుండా తగుజాగ్రత్తలు తీసుకొవాలన్నారు.
క్లౌడ్ బస్టర్ పరిస్థితులను ఎదుర్కొనే వ్యూహాలను సిద్దం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఊహించనంత వర్షపాతంతో గతంలో ఖమ్మం, వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోకి ఇన్ఫ్లో, ఔట్ ఫ్లోపై పూర్తి అవగాహనతో ఉండాలని నీటి పారుదల శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.
చెరువులు, కుంటలు కట్టల తెగే ప్రమాదం ఉన్నందున ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది 24X7 అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లు , విద్యుత్ స్తంభాలు, ఇతర సామగ్రి సిద్దంగా ఉంచాలన్నారు.
సమస్య ఎక్కడ తలెత్తినా తక్షణమే పరిష్కరించాలన్నారు. వైద్యారోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని... పీహెచ్సీలు, సీహెచ్సీల్లో అవసరమైన మందులు ఉంచాలని, గర్భిణులను తక్షణమే తరలించేలా అంబులెన్స్లు అందుబాటులో ఉంచాలని సీఎం సూచించారు. పిడుగుపాట్లతో పశువులు, మేకలు, గొర్రెలు చనిపోయినప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయించి బాధితులకు పరిహారం అందేలా చూడాలని పశుసంవర్ధక శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.
హైదరాబాద్ నగరంలో....
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు సమన్వయంతో పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్, ఎంఏయూడీ.. ప్రతి విభాగం సమన్వయంతో ముందుకు సాగాలని సీఎం సూచించారు. ఐటీ, విద్యా శాఖ ఉన్నతాధికారులు పరిస్థితిపై సమీక్షించి వర్క్ ఫ్రం హోం.. సెలవుల విషయమై నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారు.
లా అండ్ ఆర్డర్ పోలీసులు సైతం ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగస్వాములు కావాలని సీఎం సూచించారు. వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు అందజేయాలని.. అదే సమయంలో ప్రజల్లో భయానక వాతావరణం సృష్టించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook