All Party MPs Meeting: సెంటిమెంట్తో మళ్లీ బీఆర్ఎస్ పార్టీని బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైతులను కష్టాల నుంచి బయటపడేసేందుకు ఆనాడు కాంగ్రెస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాం. కేసీఆర్, హరీష్ సంపూర్ణ అవగాహనతో ప్రభుత్వానికి సహకరించినా.. సూచనలు చేసినా స్వీకరిస్తాం. కానీ దురుద్దేశంతో రాజకీయ ప్రయోజనాల కోసం మాపై విమర్శలు చేస్తున్నారు. 8 పేజీల మీటింగ్ మినిట్స్ రికార్డు చేశారు. ఆ సమావేశంలో 3 వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని కేసీఆర్ ప్రతిపాదన పెట్టారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని ఆ సమావేశంలోనే పునాది పడింది' అని తెలిపారు. ఈ మీటింగ్ మినిట్స్ హరీశ్ రావుకు పంపిస్తా అని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
Also Read: K Kavitha: 'చంద్రబాబును జల దోపిడీని అడ్డుకోవడంలో రేవంత్ రెడ్డి పేపర్ పులి'
'2019లో ఆనాటి ఏపీ సీఎం వైఎస్ జగన్తో నాలుగుసార్లు సమావేశమై కేసీఆర్ రాయలసీమకు నీటి తరలిపునకు నిర్ణయం తీసుకున్నారు. ఆ సమావేశం వివరాలను ఆనాటిమంత్రులు ఈటెల రాజేందర్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వివరించారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని ఆనాడు కేసీఆర్ మాట్లాడారు. గోదావరి- బనకచర్ల విషయంలో 2016లో కేసీఆర్, చంద్రబాబు మాట్లాడుకున్న అంశాల సాకుతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముందుకువెళుతోంది' అని రేవంత్ రెడ్డి వివరించారు.
Also Read: KTR Letter: నా సెల్ఫోన్, ల్యాప్ట్యాప్ ఎలా అడుగుతారు? ఏసీబీకి కేటీఆర్ ప్రశ్నలు
'బేసిన్లు లేవు.. భేషజాలు లేవు అని కేసీఆర్ ఆనాడు మాట్లాడారు. ఏపీ చేపట్టేది 200 టీఎంసీ ప్రాజెక్టు కాదు 300 టీఎంసీల కోసం. ఆనాడు కేసీఆర్ 400 టీఎంసీలు తీసుకోవచ్చని అంగీకరించారు. మేం వాదనలకు వెళ్లదలచుకోలేదు.. అందుకే తెలంగాణకు నష్టం జరగొద్దని జలశక్తి మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశాం. మా ప్రభుత్వం ఎక్కడా నిర్లక్ష్యం వహించలేదు' అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఉన్నఫలంగా హరీష్ బకెట్లో బురద తీసుకుని మాపై చల్లాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ పాపానికి కారకుడు మీ మామనే అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పాపాల భైరవులు మీరు అని విమర్శించారు.
'కాంట్రాక్టర్ పెట్టిన సమావేశంలో కమీషన్లకు కక్కుర్తి పడి కుట్రలు చేశారు. ఇప్పుడు వాళ్లు అధికారంలో లేరని ఆ బురద మాపై చల్లాలని చూస్తున్నారు. వీళ్లు ఏనాడు తెలంగాణ ప్రయోజనాల కోసం పాటుపడలేదు. పాలమూరు జిల్లాల్లో మొదలైన ఏ ప్రాజెక్టును వీళ్లు పూర్తిచేయలేదు. పదేళ్లలో పెండింగ్లో ఉన్న ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదు' అని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. హరీష్ రావు హుందాగా వ్యవహరించాలి.. అబద్ధాలతో కాలం వెళ్లదీయొద్దని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









