)
Telangana Cabinet Portfolios: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన యేడాదిన్న తర్వాత ముగ్గురితో మంత్రివర్గాన్ని విస్తరించారు. ఈ సారి మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణలో భాగంగా ఎస్సీలకు ఇద్దరికి చోటు కల్పించారు. ఇందులో మాల, మాదిగలకు ఒక్కోటి చొప్పున కేటాయించారు. అటు తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి మరో మంత్రి పదవి దక్కింది. అయితే.. కొత్తగా చేపట్టిన మంత్రులతో కలిపి తెలంగాణ క్యాబినేట్ ముఖ్యమంత్రితో కలిపి 15 మంది అయ్యారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఢిల్లీకి వాళ్లకు కేటాయించే శాఖలపై పెద్ద చర్చ నడిచింది. దీనీపై రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇప్పట్లో మంత్రివర్గ ప్రక్షాళన లాంటిది ఏమి ఉండదని చెప్పుకొచ్చారు.
మంత్రుల శాఖల కేటాయింపుపై జరుగుతున్న ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి ఎండ్ కార్డ్ వేశారు. అందరు అనుకున్నట్టు మంత్రి వర్గ ప్రక్షాళన ఉండదు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు నా దగ్గర ఉన్న శాఖలను కేటాయిస్తానని చెప్పుకొచ్చారు. ఇప్పట్లో శాఖల ప్రక్షాళన ఉండదని క్లారిటీ ఇచ్చారు. పాత మంత్రుల శాఖలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పుకొచ్చారు.
ఈసారి క్యాబినేట్ విస్తరణలో అడ్లూరి లక్ష్మణ్.. తెలంగాణలో అధిక సంఖ్యలో ఉన్న ఎస్సీ మాదిగ కులానికి చెందిన వారు. మరోవైపు ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి ప్రముఖ పారిశ్రామిక వేత్త వివేక్ వెంకట స్వామికి క్యాబినేట్ లో బెర్త్ ఇచ్చారు. తెలంగాణ ఎన్నికల సమయంలో ఆయన క్యాబినేట్ తీసుకుంటామనే హామితోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇంకోవైపు బీసీల నుంచి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఈయనకు రేవంత్ రెడ్డి హామి మేరకు క్యాబినేట్ లో చోటు కల్పించారు. అయితే రేవంత్ రెడ్డి దగ్గర కీలకమైన హోం, విద్యా, మున్సిపల్, సాధారణ పరిపాలన, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, కార్మిక, పశుసంవర్థకం, మైనింగ్ వంటి శాఖలున్నాయి. వాటిలో ఏ శాఖలను ఈ ముగ్గురికి కేటాయిస్తారనేది చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook