Rythu Bharosa: తెలంగాణ లో రైతు బంధు పూర్తి పైసలు ఈ సారైనా పడతాయా అంటే లేవనే చెప్పాలి. మార్చి నెలతో ఆర్ధిక సంవత్సరానికి ముగింపు. ఈ రోజు శనివారం మాత్రమే బ్యాంకులు మధ్యాహ్నం వరకే పనిచేస్తాయి. రేపు ఆదివారం ఉగాది పండగ సందర్భంగా బ్యాంకులకు సెలవు. మరోవైపు సోమవారం రంజాన్ పండగ నేపథ్యంలో సెలవు దినం. ఈ రోజు కూడా బ్యాంకులు పనిచేయవు.
ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్నలక్షా ఆరు వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. 3లక్షల 33వేల ఎకరాల భూమికి సంబంధించిన నిధులు జమ అయ్యాయి. అయితే తెలంగాణ సర్కార్ చెప్పినట్లు మార్చి 31నాటికి రైతు భరోసా పూర్తి స్థాయిలో వేస్తామని ప్రకటించింది. రేపు ఆదివారం, ఎల్లుండి రంజాన్ కావటంతో బ్యాంకులకు సెలవులు దీంతో సర్కార్ చెప్పిన తేదీ కూడా దాటిపోతుంది. మరోవైపు ఐదు ఎకరాల వరకే రైతు భరోసా వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ డబ్బులు కేవలం రైతులకు కేవలం రెండు ఎకరాలు లోపు మాత్రమే ఉన్న చిన్న, సన్నకారు రైతులకు పైసలు వేస్తున్నారు. అది కుటుంబంలో రేషన్ కార్డు ఉన్నవారికే మాత్రమే ఈ డబ్బులు పడుతున్నాయి. కానీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనాలోచితంగా వందల ఎకరాలున్న ఆసాములకు గుట్టలు, బీడు, పాడుపడ్డ భూములకు కూడా రైతు బంధు పైసలు వేయడం అప్పట్లో పలు వివాదాలకు తావు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ముందుగా పది ఎకరాలు అని చెప్పి.. ఇపుడు ఐదు ఎకరాలకు రైతు బంధును పరిమితం చేయాలనే యోచనలో ఉంది.
ఇదీ చదవండి: Madhuri Dixit Love Affair: ప్రముఖ క్రికెటర్ తో మాధురి దీక్షిత్ లవ్ ఎఫైర్.. ఎందుకు బ్రేకప్ అయిందంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.








