Senior ias Smita Sabharwal latest insta post: తెలంగాణలో కంచ గచ్చిభూముల అంశం రాజకీయంగా రచ్చగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనను ఏకంగా సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని కేసును విచారిస్తుంది. గతంలో రేవంత్ సర్కారు.. హైదరబాద్ సెంట్రల్ యూనివర్సీటీ కంచ గఛ్చిభూముల అంశంపై కొంత మంది ఏఐ జనరేటేడ్ ఇమేజ్ లు, వీడియోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు. దీనిలో మూగజీవాలు పారిపోతున్నట్లు, బుల్డోజర్ లు ఉన్నట్లు చూపించారు . దీనిపై చాలా మంది రీపోస్ట్ లు చేశారు. దీంతో రేవంత్ ప్రభుత్వం ఈ ట్విట్ లను వైరల్ చేసిన వారిపై చర్యలకు దిగింది.
ఈ నేపథ్యంలో తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ స్మిత సబర్వాల్ సైతం.. కంచ భూముల అంశంను రీట్విట్ చేశారు. దీంతో గచ్చి బౌలీ పోలీసులు అధికారిణికి నోటీసులు జారీ చేశారు. ఆతర్వాత స్మిత సబర్వాల్ పోలీసులకు సహకరించి దీనిపై వివరణ ఇచ్చారు. తాను చేసిన పోస్ట్ లో ఎలాంటి కాంట్రవర్సీలేదని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఈ ఘటన తర్వాత పోలీసులకు ఎక్స్ వేదికగా.. ప్రశ్నలు సంధించారు.
దీనిపై సుమారు..2 వేల మంది రీట్విట్ చేశారని.. అందరికి నోటీసులు ఇస్తారా..?..నన్నే ఏమన్నా.. టార్గెట్ చేశారా.. ?.. పోలీసులకు ప్రశ్నలు సంధించింది.ఈ నేపథ్యంలో ఇది కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. కాంగ్రెస్ నేతలు కొంత మంది సీనియర్ అధికారిణికి సపోర్ట్ గా మాట్లాడుతుండగా.. మరికొందరు ఆమె పాలిటిక్స్ లోకి వెళ్తే బాగుంటుందని.. ప్రభుత్వంలో ఉంటూ.. సర్కారు నిర్ణయాలకు వ్యతిరేకంగా పోస్ట్ లు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కౌంటర్ లు వేశారు.
ఈ క్రమంలో ఇటీవల అనూహ్యంగా తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. దీనిలొ ప్రస్తుతం టూరిజం శాఖకు సెక్రటరీగా ఉన్న స్మిత సబర్వాల్ ను.. మరల తను గతంలో నిర్వహించిన ఫైనాన్స్ శాఖకు సెక్రెటరీగానే నియమించారు. ఈ క్రమంలో కొంత మంది ఐఏఎస్ వర్సెస్ రేవంత్ సర్కారు మధ్య వార్ అన్నట్లు వార్తలు వైరల్ గా మారాయి.
అయితే.. తెలంగాణలో మే 7 నుంచి 31 వరకు హైటెక్స్ లో జరిగే ఈ పోటీల కోసం జీహెచ్ఎంసీ రూ.1.70 కోట్ల అంచనాతో ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. దీనికోసం సీనియర్ అధికారిణి తన వంతు పాత్ర పోషించారు. ఈ క్రమంలో అనూహ్యాంగా కాంగ్రెస్ ప్రభుత్వం.. స్మిత సబర్వాల్ ను టూరిజం నుంచి తప్పించి.. ఫైనాన్స్ శాఖకు బదిలీచేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read more: Smita Sabharwal: స్మితా సబర్వాల్కు షాకిచ్చిన రేవంత్ సర్కార్.. పోస్టింగ్ ఎక్కడంటే..?
అదే విధంగా స్మిత సబర్వాల్ తాజాగా.. తన ఎక్స్ ఖాతాలో.. భగవద్గీతలోని కర్మణ్యే వ్యాధికరాస్తే మా ఫలేషు కదాచన.. అనే శ్లోకంను కోట్ చేస్తు.. పనిచేయాలి కానీ.. ఫలితం గురించి ఆశించకూడదని అర్థం వచ్చేలా కోటెషన్ పోస్ట్ చేశారు.
ఈ నాలుగు నెలల పాటు.. టూరిజం శాఖకు తన వంతుగా అన్ని విధాలుగా న్యాయం చేశానని చెప్పుకొచ్చారు. పెండింగ్ లో ఉన్న అనేక పనుల్లో కదలిక వచ్చేలా చేశానన్నారు. అదే విధంగా తెలంగాణలో నిర్వహిస్తున్న.. మిస్ వరల్డ్ పోటీల్లో తన కాంట్రీబ్యూషన్ ఉండటం తనకు ఆనందాన్ని ఇచ్చిందన్నారు. మొత్తంగా సీనియస్ అధికారిణి స్మిత సబర్వాల్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం మరోసారి హట్ టాపిక్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.