Hyderabad News: హైదరాబాద్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో విషాదం.. విద్యుత్ షాక్‌తో ఆరుగురు మృతి.. నేతల తీవ్ర దిగ్బ్రాంతి..

Electrocuted incident in Ramanthapur: రామంతాపూర్‌ గోఖలేనగర్‌ శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో చోటుచేసుకున్న పెను విషాదంలో మరో వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఇప్పటి వరకు ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది. దీనిపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Aug 18, 2025, 12:37 PM IST
  • రామంతాపూర్ లో విద్యుత్ షాక్ ఘటన..
  • మిన్నంటిన బాధిత కుటుంబాల రోదనలు..
Hyderabad News: హైదరాబాద్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో విషాదం.. విద్యుత్ షాక్‌తో ఆరుగురు మృతి.. నేతల తీవ్ర దిగ్బ్రాంతి..

Six electrocuted during sri krishna Janmashtami procession in Ramanthapur: దేశమంతట కూడా జన్మాష్టమి వేడుకల్ని ఎంతో సంబరంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో రామంతాపూర్ లో జరిగిన శోభయాత్రలో మాత్రం తీవ్ర విషాదం సంభవించింది. శ్రీకృష్ణ శోభాయాత్రను స్థానిక యువకులు చేపట్టారు. అప్పటి వరకు ఎంతో ఉల్లాసంగా జన్మాష్టమి కోసం వాహనంను ప్రత్యేకంగా అలంకరించారు. ఈ క్రమంలో రథాన్ని వీధిలో తీసుకొచ్చి దానిపై కన్నయ్య విగ్రహం పెట్టి అందంగా పూలతో అలంకరించి ఊరేగింపును తీశారు.

Add Zee News as a Preferred Source

 

అప్పటి వరకు ఆనందంతో, హుషారుగా కేరింతలు కొట్టిన వారంతా కళ్ల ముందే ఒక్కసారిగా దూరంగా విసిరివేయబడ్డారు. రథానికి విద్యుత్‌ తీగలు తగిలి ఐదుగురు స్పాట్ లోనే మృతి చెందారు. వీరంతా కరెంట్ షాక్ తో దూరంగా విసిరివేయబడ్డారు. కరెంట్‌ షాక్‌తో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే స్థానికులు గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు.

ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి చనిపోయాడు. దీంతో కరెంట్ షాక్ తో ఆరుగురు దుర్మరణం చెందారు. చనిపోయిన వారిలో.. శ్రీకాంత్‌ రెడ్డి(35), సురేష్‌ యాదవ్‌(34),రాజేంద్రరెడ్డి(39), రుద్రవికాస్‌(39), కృష్ణ యాదవ్‌(24) మృతి చెందారు. మరోవైపు తీవ్రంగా గాయపడిన వారిలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గన్‌మెన్‌ శ్రీనివాస్‌ కూడా ఉన్నారు. ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రదిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

అదే విధంగా హైదరాబాద్‌లో విద్యుదాఘాతానికి గురై ఆరుగురు యువకులు మృత్యువాత పడడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ సైతం విచారం వ్యక్తం చేశారు.  జన్మాష్టమి వేడుకల్లో.. విద్యుదాఘాతానికి గురై ఆరుగురు యువకులు మృతిచెందడం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు.

Read more: Ganesh Chaturthi 2025: వినాయక చవితి ఎప్పుడు..?.. ఇంట్లో ప్రతిష్టించుకునే గణపయ్య తొండం ఎటువైపు ఉండాలి..?. ఈ విషయాలు మీకు తెలుసా..?

పండగ వేళ జరిగిన ఈ దుర్ఘటన చాలా బాధాకరమని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ కోరారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత సైతం తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News