Revanth Visits SLBC: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ లో గత 9 తొమ్మిది రోజులుగా కార్మికుల కోసం రెస్క్యూ టీం ఆపరేషన్ కొనసాగుతోంది. లోపల్ల చిక్కుకుపోయిన కార్మికుల బాడీలను బయటికి తీసుకువచ్చేందుకు సహాయ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే టన్నెల్ లోపల వివిధ రంగాలకు చెందిన బృందాలకు అడుగడుగునా సవాళ్లు ఎదురవుతున్నాయి.
సిల్ట్, శిథిలాల తొలగింపునకు కనీసం మరో మూడు రోజులు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. టన్నెల్లోపల చిక్కుకున్న వారి డెడ్ డీలను గుర్తించారన్న వార్తలతో నాలుగు రోజులుగా అక్కడే ఉంటున్న బాధిత కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
బీఆర్ఎస్, బీజేపీ అభివృద్ధి పనులు అడ్డుకుంటున్నాయని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. కేసీఆర్ గ్రహం పట్టి గతంలో డ్వాక్రా సంఘాలు నిర్వీరయమయ్యాయని ఆరోపించారు. పదేళ్లు పాలమూరు వలస గురించి కేసీఆర్ ఆలోచించారా అని ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్లు ఆడబిడ్డలకు ఇచ్చామన్నారు సీఎం రేవంత్రెడ్డి.
అంతకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన వనపర్తిలో పర్యటించి. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ. 721 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. యంగ్ ఇండియా స్కూల్, ఐటీ టవర్తో పాటు..పెబ్బేరులో ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్రెడ్డి.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









